Trends

CSK vs MI: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. వైరల్ వీడియో కలకలం!

ఐపీఎల్ 2025 సీజన్‌ ఓ అద్భుతమైన మ్యాచ్‌తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది చెన్నై – ముంబై మ్యాచ్. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా, మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై టీమ్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ముంబై ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రకారం.. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బంతిపై ఏదో ఓ వస్తువుతో మానిపులేషన్ చేశాడని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినట్టు చూపించారు.

వెంటనే రుతురాజ్ దానిని జేబులో వేసుకున్నట్టు వీడియో కట్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్‌కేపై శిక్షలు విధించాలని ముంబై అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఖలీల్ అహ్మద్ మ్యాచ్‌లో చెలరేగి ముంబై కీలక వికెట్లు తీసిన విషయం మరింత ఫైర్‌ను పెట్టింది. రోహిత్ శర్మ డకౌట్ కావడం, రికెల్టన్ క్లీన్బౌల్డ్ అవ్వడం ఈ ఆరోపణలకు బలాన్నిచ్చినట్టు నెట్టింట వాదనలు వెల్లువెత్తుతున్నాయి. “ఇది మ్యాచ్‌ను మలుపుతిప్పిన కుట్ర” అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను సీఎస్‌కే ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. వీడియో క్లియర్‌గా లేదని, అది సాధారణంగా ప్లేయర్ల మధ్య జరిగే కమ్యూనికేషన్ అవుతుందని అంటున్నారు. బహుశా ఛూయింగ్ గమ్ ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగానీ ట్యాంపరింగ్ అనేది నిర్ధారణ అవ్వాలంటే స్పష్టమైన ఆధారాలు అవసరమని అంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇది బిగ్ డిబేట్‌గా మారింది. మరి మ్యాచ్‌ను మరిచిపోతున్న ఈ ఆరోపణలు ఏ దిశగా పోతాయో వేచి చూడాలి.

This post was last modified on March 24, 2025 9:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలు

దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత…

3 minutes ago

త్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…

52 minutes ago

ఈ `తెలివి` తేట‌లు సీఎం రేవంత్ వేనా?

తెలివి ఎవ‌రి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత క‌ష్ట‌మైన పనైనా సులువుగా మారిపోవ‌డంతోపాటు సులువుగా మార్చుకోవ‌డానికి కూడా అవ‌కాశం…

1 hour ago

ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం…

2 hours ago

నిన్న అర్జున్… ఇవాళ వరలక్ష్మి

తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి…

3 hours ago

వాయిదాల వర్షంలో అలియా భట్ సినిమా

దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…

3 hours ago