ఐపీఎల్ 2025 సీజన్ ఓ అద్భుతమైన మ్యాచ్తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చెన్నై – ముంబై మ్యాచ్. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో సీఎస్కే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా, మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై టీమ్పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ముంబై ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రకారం.. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బంతిపై ఏదో ఓ వస్తువుతో మానిపులేషన్ చేశాడని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించినట్టు చూపించారు.
వెంటనే రుతురాజ్ దానిని జేబులో వేసుకున్నట్టు వీడియో కట్ను వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్కేపై శిక్షలు విధించాలని ముంబై అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఖలీల్ అహ్మద్ మ్యాచ్లో చెలరేగి ముంబై కీలక వికెట్లు తీసిన విషయం మరింత ఫైర్ను పెట్టింది. రోహిత్ శర్మ డకౌట్ కావడం, రికెల్టన్ క్లీన్బౌల్డ్ అవ్వడం ఈ ఆరోపణలకు బలాన్నిచ్చినట్టు నెట్టింట వాదనలు వెల్లువెత్తుతున్నాయి. “ఇది మ్యాచ్ను మలుపుతిప్పిన కుట్ర” అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను సీఎస్కే ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. వీడియో క్లియర్గా లేదని, అది సాధారణంగా ప్లేయర్ల మధ్య జరిగే కమ్యూనికేషన్ అవుతుందని అంటున్నారు. బహుశా ఛూయింగ్ గమ్ ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేగానీ ట్యాంపరింగ్ అనేది నిర్ధారణ అవ్వాలంటే స్పష్టమైన ఆధారాలు అవసరమని అంటున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఇది బిగ్ డిబేట్గా మారింది. మరి మ్యాచ్ను మరిచిపోతున్న ఈ ఆరోపణలు ఏ దిశగా పోతాయో వేచి చూడాలి.
This post was last modified on March 24, 2025 9:51 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…