మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని నిలబడగలదా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. కానీ ట్రైలర్ వచ్చాక, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగాక లెక్కలు మారిపోతున్నాయి. తెలుగు వెర్షన్ కు అంత డిమాండ్ కనిపించకపోయినా మలయాళంతో సహా అన్ని భాషలు కలుపుకుని ఇప్పటిదాకా ఏడు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయినట్టు వస్తున్న రిపోర్ట్స్ షాక్ ఇస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తున్న మన ఆడియన్స్ ఇందులో అంత విషయముందా అంటూ ఆసక్తి పెంచుకుని మార్చి 27 మొదటి రోజు లుక్ వేసేలా ఉన్నారు.
అసలు విషయం మరొకటి ఉంది. ఎల్2 ఎంపురాన్ ని పంపిణి చేస్తోంది దిల్ రాజు. తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా ఒక రోజు ముందే వస్తుంది కాబట్టి ఎక్కుడ స్క్రీన్లు, షోలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. హిట్ టాక్ వచ్చిందా వాటిలో ఎక్కువ శాతం హోల్డ్ చేసే అవకాశం ఉంది. పోటీలో తమ చిత్రాలను దించుతున్న మైత్రి, సితారలు చిన్న బ్యానర్లు కాదు కానీ ఎంపురాన్ కనక బాగుందనే మాట తెచ్చుకుంటే వసూళ్ల పరంగా పంపకాలు తప్పవు. అలా కాకుండా రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కనక ఎక్స్ ట్రాడినరి టాక్ తెచ్చుకుంటే టెన్షన్ ఉండదు. ఎంపురాన్ ఒకవేళ యావరేజ్ అనిపించుకున్నా జనాలు మన వాటికే ప్రాధాన్యం ఇస్తారు.
సో బాక్సాఫీస్ వద్ద పోరు ఆసక్తికరంగా మారబోతోంది. ఎల్2 ఎంపురాన్ తో పోల్చుకుంటే విక్రమ్ వీరధీరశూర పార్ట్ 2 బజ్ పరంగా చాలా వెనుకబడి ఉంది. టీమ్ వచ్చి హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ చేశారు కానీ దాని ప్రభావం ఏమంత కనిపించడం లేదు. ఎస్జె సూర్యతో కల్సి విక్రమ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ట్రైలర్ కట్ బాగానే వెళ్తోంది. కానీ ఓపెనింగ్స్ తేవడానికి ఇవన్నీ సరిపోవు. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఈ పరిస్థితి వేరేలా ఉండేది. చిరంజీవి గాడ్ ఫాదర్ కన్నా లూసిఫర్ ని ఎక్కువగా ఇష్టపడిన టాలీవుడ్ మూవీ లవర్స్ లిస్టులో ఎల్2 ఎంపురాన్ అయితే ఉంది. అది ఎంత మోతాదనేది పూర్తి బుకింగ్స్ మొదలయ్యాక అర్థమవుతుంది.
This post was last modified on March 23, 2025 9:54 pm
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…