బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్డాగ్ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు.
అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం 8 నెలల వయస్సులో 5 కిలోల బరువును కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుందని సమాచారం. ఎస్. సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. పెంపుడు జంతువులపై అతనికి అపారమైన ఆసక్తి ఉంది. ఇప్పటివరకు 150కి పైగా వివిధ జాతుల కుక్కలను పెంచుతున్నారు. ఈ ఖరీదైన వోల్ఫ్డాగ్ను ఆయన ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు.
కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల స్థలంలో ఆధునిక సదుపాయాలతో డాగ్ ఫామ్ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి కుక్కకు 20×20 అడుగుల గదిని కేటాయించి, వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా 6 మంది సిబ్బందిని నియమించారు. ఈ అరుదైన జాతుల కుక్కలను ప్రదర్శించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఈ కుక్కలను చూసేందుకు సతీష్ దగ్గరకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 30 నిమిషాల ప్రదర్శనకు రూ.2.5 లక్షలు, 5 గంటల పాటు ప్రదర్శనకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా సతీష్ రూ.27 కోట్లకు చౌ చౌ జాతి కుక్కను కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
This post was last modified on March 21, 2025 5:04 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…