Trends

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు.

అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం 8 నెలల వయస్సులో 5 కిలోల బరువును కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుందని సమాచారం. ఎస్. సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. పెంపుడు జంతువులపై అతనికి అపారమైన ఆసక్తి ఉంది. ఇప్పటివరకు 150కి పైగా వివిధ జాతుల కుక్కలను పెంచుతున్నారు. ఈ ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను ఆయన ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు.

కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల స్థలంలో ఆధునిక సదుపాయాలతో డాగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి కుక్కకు 20×20 అడుగుల గదిని కేటాయించి, వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా 6 మంది సిబ్బందిని నియమించారు. ఈ అరుదైన జాతుల కుక్కలను ప్రదర్శించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఈ కుక్కలను చూసేందుకు సతీష్ దగ్గరకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 30 నిమిషాల ప్రదర్శనకు రూ.2.5 లక్షలు, 5 గంటల పాటు ప్రదర్శనకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా సతీష్ రూ.27 కోట్లకు చౌ చౌ జాతి కుక్కను కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.

This post was last modified on March 21, 2025 5:04 am

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

6 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

9 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

9 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

9 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

10 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

10 hours ago