Trends

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు.

అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం 8 నెలల వయస్సులో 5 కిలోల బరువును కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది రోజుకు 3 కిలోల మాంసం తింటుందని సమాచారం. ఎస్. సతీష్ ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా. పెంపుడు జంతువులపై అతనికి అపారమైన ఆసక్తి ఉంది. ఇప్పటివరకు 150కి పైగా వివిధ జాతుల కుక్కలను పెంచుతున్నారు. ఈ ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను ఆయన ఫిబ్రవరిలో కొనుగోలు చేశారు.

కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా 7 ఎకరాల స్థలంలో ఆధునిక సదుపాయాలతో డాగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి కుక్కకు 20×20 అడుగుల గదిని కేటాయించి, వాటి రక్షణ కోసం ప్రత్యేకంగా 6 మంది సిబ్బందిని నియమించారు. ఈ అరుదైన జాతుల కుక్కలను ప్రదర్శించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఈ కుక్కలను చూసేందుకు సతీష్ దగ్గరకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. 30 నిమిషాల ప్రదర్శనకు రూ.2.5 లక్షలు, 5 గంటల పాటు ప్రదర్శనకు రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గతంలో కూడా సతీష్ రూ.27 కోట్లకు చౌ చౌ జాతి కుక్కను కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు.

This post was last modified on March 21, 2025 5:04 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మమ్ముట్టి కోసం శబరిమలలో పూజ చేస్తే తప్పేంటి?

శబరిమలలోకి అన్యమతస్థులను అనుమతించే విషయంలో షరతులపై ఎప్పట్నుంచో వివాదాలున్నాయి. క్రిస్టియన్ అయిన ఏసుదాసు శబరిమలకు రావాలనుకున్నపుడు ఆయన్ని అడ్డుకోవడం మీద…

32 minutes ago

వంశీ ముక్కుపై గాయం… ఏం జరిగింది?

వైసీపీలో అందగాళ్లంతా కూటమి సర్కారుకు టార్గెట్ గా మారుతున్నారంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న…

49 minutes ago

ఇప్పాల… ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారా?

ఏపీలో విపక్షం వైసీపీకి హార్డ్ కోర్ అభిమానిగానే కాకుండా ఆ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా కొనసాగుతున్న ఇప్పాల రవీంద్రా…

2 hours ago

4 బ్లాక్ బస్టర్లకు మైత్రి రవిశంకర్ హామీ

ఏ సినిమా గురించైనా వాటి నిర్మాతలు బాగుంటుంది అదిరిపోతుంది చూడమని చెప్పడం సహజం. కానీ మైత్రి రవిశంకర్ ఒక అడుగు…

2 hours ago

ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం తెలంగాణ RTC గుడ్ న్యూస్

హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో…

3 hours ago

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కేంద్రం క్లారిటీ.. రాష్ట్రాలకే అధికారం!

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ భూతంగా మారుతున్న ఈ రోజుల్లో, కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్…

3 hours ago