అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇటీవల స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా భూమికి సురక్షితంగా తిరిగివచ్చారు. అయితే, వారి రాక ఆలస్యం కావడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వమే కారణమని స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మస్క్ వెల్లడించగా, ఈ అంశం అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
“సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను ముందుగానే భూమికి తీసుకురావాలని మేము బైడెన్ ప్రభుత్వానికి ప్రతిపాదించాం. కానీ, రాజకీయ కారణాలతోనే ఆ అవకాశాన్ని తిరస్కరించారు. వారు కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లి, అంతే వేగంగా వెనక్కి రావాలి, కానీ 10 నెలలు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇది సరైన నిర్ణయమా?” అని మస్క్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మస్క్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడే మొదటిసారి కావు. గతంలో జనవరి 2025లో కూడా ట్రంప్ అడగడంతో వ్యోమగాముల రాకకు సహాయపడతానని వెల్లడించారు.
మస్క్ వ్యాఖ్యలతో పాటు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన “ట్రూత్ సోషల్” ప్లాట్ఫామ్లో స్పందిస్తూ, “బైడెన్ ప్రభుత్వం అంతరిక్షంలో ఉన్న ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మస్క్ ద్వారా వీరిని భూమికి తీసుకురావాలని నేను సూచించాను. త్వరలోనే మిషన్ ప్రారంభమవుతుంది” అని గతంలో తెలిపారు. ఇది బైడెన్ ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత హైలైట్ చేస్తోందని ట్రంప్ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఇంతకుముందు, జూన్ 2024లోనే బోయింగ్ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సమస్యలు ఎదుర్కొనడంతో, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తిరిగి రప్పించేందుకు నాసా ప్రయత్నించింది. అయితే, ఆ సమయంలో సరైన చర్యలు తీసుకోకుండా వారిని అంతరిక్షంలోనే కొనసాగించారని మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మస్క్ ఆరోపణలపై బైడెన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ, ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on March 20, 2025 7:04 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…