ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ ధనశ్రీ అతడి నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటికి రాగానే ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని రోజుల కిందటే ధనశ్రీ కుటుంబం ఖండించింది. ఐతే వాస్తవానికి చాహల్ నుంచి ధనశ్రీ ఎంత మొత్తం భరణం రూపంలో తీసుకుంటున్నది ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. వీరికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భరణం గురించి కూడా ఆదేశాలు చేసినట్లు వెల్లడైంది. ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వాలని చాహల్కు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అందులో భాగంగా చాహుల్ ఆల్రెడీ రూ.2.37 కోట్లు చెల్లించాడట. ఇదిలా ఉండగా విడాకులు మంజూరు చేస్తూనే.. దీనిపై పునరాలోచించుకునేందుకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ను చాహల్, ధనశ్రీ జంటకు కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో కూలింగ్ పీరియడ్ను మినహాయించాలాని చాహల్ కోరినట్లు సమాచారం. ఐతే ఇంకా పూర్తి భరణం చెల్లించని నేపథ్యంలో చాహల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందట. ఈ నేపథ్యంలో మొత్తం భరణం చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చాహల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on March 19, 2025 6:58 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…