Political News

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల భ‌క్తుల‌పై తీవ్ర ప్ర‌భావం కూడా చూపించింది. వీటి విలువ 70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవ‌డంతోపాటు.. ఫిర్యాదు చేసిన అప్ప‌టి టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది.. సీఐ.. స‌తీష్ కుమార్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు.

మొత్తంగా ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు ఈ కేసుపై కీల‌క వ్యాఖ్యలు చేసింది. దీనిని కేవ‌లం దొంగ‌త‌నంగా చూడ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది. ఇది అతి పెద్ద నేర‌మ‌ని, కోట్ల మంది భ‌క్తుల విశ్వాసానికి, శ్రీవారి ఆల‌య న‌గ‌దు భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ని పేర్కొంది. దీనిని తేలిక‌గా తీసుకుంటే.. భ‌క్తుల విశ్వాసానికి గండి కొట్టిన‌ట్టే అవుతుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో నిందుతుల విష‌యాన్ని లైట్‌గా తీసుకునేందుకు కోర్టు సిద్ధంగా లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసు విచార‌ణ‌ను నిష్ప‌క్షపాతంగా నిర్వ‌హించాల‌ని సీఐడీ అధికారుల‌కు కోర్టు స్ప‌ష్టం చేసింది. అదే సమ‌యంలో ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కిపు వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాన్ని త‌మ‌కు చెప్పాల‌ని టీటీడీని ఆదేశించింది. అదేవిధంగా భ‌క్తుల‌కు కూడా ఈ విష‌యంలో అవ‌కాశం క‌ల్పించాల‌ని.. మ‌రింత ప‌క‌డ్బందీగా లెక్కింపు నిర్వ‌హించాల‌ని కూడా కోర్టు ఆదేశించింది. ప్ర‌తి విష‌యానికీ టీటీడీ బాధ్య‌త వ‌హించాల్సి  ఉంటుంద‌ని, కోట్ల మంది భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది.

ముఖ్యంగా ఔట్ సోర్సింగ్‌(వేరే ఉద్యోగం చేసుకుంటూ.. పార్ట్‌టైమ్‌గా ప‌నిచేసేవారు) ఉద్యోగుల‌ను ఈ విధుల‌కు నియ‌మించే విష‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని సూచించింది. అదేవిధంగా శ్రీవారిపై అచంచ‌ల భ‌క్తిని చాటుకునే వారికి కూడా ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కింపులో చోటు కల్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఏఐ వినియోగాన్ని పెంచాల‌ని సూచించింది.

ఇక కోర్టు వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలను మరోసారి తప్పుబడుతున్నారు. శ్రీవారి పవిత్ర సన్నిధిలో జరిగిన చోరీ చిన్నదైనా పెద్దదైనా అది ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టే అవుతుందని, ఈ విషయంలో కోర్టు కూడా జగన్ మరియు జగన్ ను వెంకేసుకొస్తున్న వైసీపీ నాయకులకు మొట్టికాయ వేసినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on December 17, 2025 6:50 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబు మీద సీరియస్ బయోపిక్

దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర…

9 minutes ago

థియేటర్ల ఆకలి తీర్చే ఆహారం ఎక్కడ

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…

45 minutes ago

MRP టీజర్ – వినోదంతో నిండిన వినూత్నమైన కథ!

https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…

2 hours ago

పెద్ది అయోమయం… సంయుక్తనా శృతినా

జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…

2 hours ago

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు ఇక లేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…

2 hours ago

వైసీపీ అనంతబాబు కథ ముగిసినట్టేనా?

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…

3 hours ago