Political News

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల భ‌క్తుల‌పై తీవ్ర ప్ర‌భావం కూడా చూపించింది. వీటి విలువ 70 వేలు. అయితే.. ఈ కేసులో రాజీ చేసుకోవ‌డంతోపాటు.. ఫిర్యాదు చేసిన అప్ప‌టి టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బంది.. సీఐ.. స‌తీష్ కుమార్‌.. అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందారు.

మొత్తంగా ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ హైకోర్టు ఈ కేసుపై కీల‌క వ్యాఖ్యలు చేసింది. దీనిని కేవ‌లం దొంగ‌త‌నంగా చూడ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది. ఇది అతి పెద్ద నేర‌మ‌ని, కోట్ల మంది భ‌క్తుల విశ్వాసానికి, శ్రీవారి ఆల‌య న‌గ‌దు భ‌ద్ర‌త‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల‌ని పేర్కొంది. దీనిని తేలిక‌గా తీసుకుంటే.. భ‌క్తుల విశ్వాసానికి గండి కొట్టిన‌ట్టే అవుతుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో నిందుతుల విష‌యాన్ని లైట్‌గా తీసుకునేందుకు కోర్టు సిద్ధంగా లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసు విచార‌ణ‌ను నిష్ప‌క్షపాతంగా నిర్వ‌హించాల‌ని సీఐడీ అధికారుల‌కు కోర్టు స్ప‌ష్టం చేసింది. అదే సమ‌యంలో ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కిపు వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానాన్ని త‌మ‌కు చెప్పాల‌ని టీటీడీని ఆదేశించింది. అదేవిధంగా భ‌క్తుల‌కు కూడా ఈ విష‌యంలో అవ‌కాశం క‌ల్పించాల‌ని.. మ‌రింత ప‌క‌డ్బందీగా లెక్కింపు నిర్వ‌హించాల‌ని కూడా కోర్టు ఆదేశించింది. ప్ర‌తి విష‌యానికీ టీటీడీ బాధ్య‌త వ‌హించాల్సి  ఉంటుంద‌ని, కోట్ల మంది భ‌క్తుల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని పేర్కొంది.

ముఖ్యంగా ఔట్ సోర్సింగ్‌(వేరే ఉద్యోగం చేసుకుంటూ.. పార్ట్‌టైమ్‌గా ప‌నిచేసేవారు) ఉద్యోగుల‌ను ఈ విధుల‌కు నియ‌మించే విష‌యంపై పున‌రాలోచ‌న చేయాల‌ని సూచించింది. అదేవిధంగా శ్రీవారిపై అచంచ‌ల భ‌క్తిని చాటుకునే వారికి కూడా ప‌ర‌కామ‌ణి కానుక‌ల లెక్కింపులో చోటు కల్పించాల‌ని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఏఐ వినియోగాన్ని పెంచాల‌ని సూచించింది.

ఇక కోర్టు వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలను మరోసారి తప్పుబడుతున్నారు. శ్రీవారి పవిత్ర సన్నిధిలో జరిగిన చోరీ చిన్నదైనా పెద్దదైనా అది ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టే అవుతుందని, ఈ విషయంలో కోర్టు కూడా జగన్ మరియు జగన్ ను వెంకేసుకొస్తున్న వైసీపీ నాయకులకు మొట్టికాయ వేసినట్టయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on December 17, 2025 6:50 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

6 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

7 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

8 hours ago