నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు. అయితే, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాత్రం ఇందుకు తాను భిన్నం అంటున్నారు. అంతేకాదు, తప్పు చేస్తే కొట్టండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి.
తాను పార్టీలో ఎవరికి చెడు చేయలేదని, తన వల్ల ఎవరికీ చెడు జరగలేదని అన్నారు. ఏదైనా పాయింట్ ఉంటే తన దగ్గరకు తీసుకువస్తే తాను మాట్లాడతానని చెప్పారు. అలా కాకుండా లేనిపోని అభాండాలు వేయడం సరికాదని హితవు పలికారు. అలా లేనిపోని అభాండాలు వేసి, దుస్తులు కాల్చి మీద వేసేవారికి దేహశుద్ధి చేయాల్సిందేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వారిని సెంటర్లో పడేసి కొట్టండి అంటూ పిలుపునిచ్చారు.
పార్టీ గురించిగానీ, వ్యక్తుల గురించిగానీ తప్పుగా మాట్లాడే వారిని కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా దేహశుద్ధి చేసిన వారికి తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. అయితే, భాష్యం ప్రవీణ్ ఏ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ఈ కామెంట్లు చేశారో తెలియదు. కానీ, తనపై బురదజల్లాలనుకునే వారికి మాత్రం డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…