ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని మొదలుపెట్టిన సినిమాలకు కూడా చివరికి లెక్కలు మారిపోతుంటాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అన్నపుడు ఆ సినిమా మిడ్ రేంజ్ మూవీనే అనుకున్నారు చాలామంది. మారుతికి అలవాటైన హార్రర్ కామెడీ జానర్లోనే ఈ సినిమా తీశాడు. అయినా సరే బడ్జెట్ రూ.400 కోట్లు దాటిపోయింది.
భారీ విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సినిమా కావడం.. పెద్ద ఎత్తున సెట్స్ వేయడం.. దేశ విదేశాల్లో చిత్రీకరణ జరపడం.. పెద్ద కాస్టింగ్ ఉండడంతో బడ్జెట్ హద్దులు దాటిపోయింది. అయినా సరే అక్కడున్నది ప్రభాస్ కాబట్టి బిజినెస్కు ఢోకా ఉండదు. ప్రభాస్ సినిమా అంటే బయ్యర్లు ఎగబడి కొంటారు. ‘రాజాసాబ్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రలో రూ.85 కోట్లు, రాయలసీమలో రూ.40 కోట్లు, నైజాంలో రూ.70 కోట్లు పెట్టి రైట్స్ తీసుకుంటున్నారట. ఎంత ప్రభాస్ సినిమా అయినా సరే.. సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య రాబోతున్న నేపథ్యంలో ఈ మేర షేర్ రాబట్టడం అంత తేలిక కాదు. ముఖ్యంగా నైజాం వ్యవహారం చాలా రిస్కీగా అనిపిస్తోంది. ఏపీలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలకు ఢోకా లేదు. కానీ తెలంగాణలో ఓజీ, అఖండ-2 చిత్రాలకు రేట్లు పెంచడంపై కేసులు పడ్డాయి. కోర్టుల్లో ఇబ్బందులు తప్పలేదు.
స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి మీడియా ముందుకు వచ్చి ఇకపై రేట్లు పెరగవని తేల్చేశారు. బెనిఫిట్ షోలు కూడా సందేహమే అంటున్నారు. కానీ రూ.70 కోట్ల షేర్ టార్గెట్ ఉండగా బెనిఫిట్ షోలు, అదనపు రేట్లు లేకుండా వర్కవుట్ చేయడం కష్టమవుతుంది. పెద్దగా పోటీ లేకపోతే లాంగ్ రన్తో సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టుకునే అవకాశముంటుంది.
కానీ సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంది. ప్రేక్షకులకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ‘మన శంకర వరప్రసాద్’ సహా మిగతా సినిమాలు రేట్లు లేకపోయినా తట్టుకోగలవు కానీ.. ‘రాజాసాబ్’కు మాత్రం నైజాంలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోలు లేవంటే ఈ రేటు రిస్కే. జీవో తెచ్చుకోలేని పరిస్థితి వస్తే ఈ రేటును రివైజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్ కోరడం ఖాయం.
This post was last modified on December 16, 2025 11:14 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…