నల్గొండలో ప్రేమ వివాహం చేసుకుని పరువు హత్యకు గురైన ప్రణయ్కి సంబంధించిన కేసులో ఇటీవలే తీర్పు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-1 అయిన మారుతీరావు కొన్నేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. సుపారీ తీసుకుని హత్యకు పాల్పడిన ఎ-2కు ఉరి శిక్ష విధించింది కోర్టు. ఇంకో ఐదుగురికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. దీనిపై గత రెండు మూడు రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రణయ్ హత్య కేసు నిందితులకు శిక్షలు పడడం పట్ల అతడి కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమైంది. మరోవైపు అమృత బాబాయికి జీవిత ఖైదు పడ్డ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు.. అమృతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రణయ్ హత్య కేసు విషయమై తీర్పు వచ్చిన కొన్ని రోజులకే అమృత తన ఇన్స్టా ఐడీలో పేరును మార్చేయడం చర్చనీయాంశం అయింది. ఇన్నాళ్లూ అక్కడ ఆమె పేరు అమృత ప్రణయ్ అని ఉండేది. కానీ ఇప్పుడు ‘అమృత వర్షిణి’ అని మారిపోయింది. తన ఐడీ నుంచి ప్రణయ్ పేరును తీసేయడం ఫాలోవర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరం ‘రిప్’ అని ఒక మెసేజ్ పెట్టి సైలెంట్ అయిపోయింది అమృత.
తీర్పు నేపథ్యంలో ఇక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అమృత భావిస్తోందనే చర్చ జరుగుతోంది. అందుకే ప్రణయ్ పేరును తన ఐడీ నుంచి తొలగించినట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆమె ఫాలోవర్లు, నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు ఈ పనిచేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆమెకూ ఒక కొత్త జీవితం అవసరం కదా, ఇందులో తప్పేముంది అంటున్న వాళ్లూ ఉన్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…