నల్గొండలో ప్రేమ వివాహం చేసుకుని పరువు హత్యకు గురైన ప్రణయ్కి సంబంధించిన కేసులో ఇటీవలే తీర్పు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-1 అయిన మారుతీరావు కొన్నేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. సుపారీ తీసుకుని హత్యకు పాల్పడిన ఎ-2కు ఉరి శిక్ష విధించింది కోర్టు. ఇంకో ఐదుగురికి ఈ కేసులో జీవిత ఖైదు పడింది. దీనిపై గత రెండు మూడు రోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రణయ్ హత్య కేసు నిందితులకు శిక్షలు పడడం పట్ల అతడి కుటుంబ సభ్యుల్లో హర్షం వ్యక్తమైంది. మరోవైపు అమృత బాబాయికి జీవిత ఖైదు పడ్డ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు.. అమృతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రణయ్ హత్య కేసు విషయమై తీర్పు వచ్చిన కొన్ని రోజులకే అమృత తన ఇన్స్టా ఐడీలో పేరును మార్చేయడం చర్చనీయాంశం అయింది. ఇన్నాళ్లూ అక్కడ ఆమె పేరు అమృత ప్రణయ్ అని ఉండేది. కానీ ఇప్పుడు ‘అమృత వర్షిణి’ అని మారిపోయింది. తన ఐడీ నుంచి ప్రణయ్ పేరును తీసేయడం ఫాలోవర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరం ‘రిప్’ అని ఒక మెసేజ్ పెట్టి సైలెంట్ అయిపోయింది అమృత.
తీర్పు నేపథ్యంలో ఇక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అమృత భావిస్తోందనే చర్చ జరుగుతోంది. అందుకే ప్రణయ్ పేరును తన ఐడీ నుంచి తొలగించినట్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఆమె ఫాలోవర్లు, నెటిజన్ల నుంచి కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పటికప్పుడు ఈ పనిచేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆమెకూ ఒక కొత్త జీవితం అవసరం కదా, ఇందులో తప్పేముంది అంటున్న వాళ్లూ ఉన్నారు.
This post was last modified on March 13, 2025 9:37 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…