Trends

విశాఖ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ మిస్టరీ మరణం?

విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని ఒక హోటల్ గదిలో మరణించిన ఎన్ఆర్ఐ మహిళ ఉదంతం షాకింగ్ గా మారింది. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉండటం.. భర్త.. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ అంశాన్ని పోలీసులు సైతం సీక్రెట్ గా ఉంచటం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం ఆమె మరణిస్తే.. శనివారం వెలుగు చూడటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఆమె మరణం సహజ మరణమని.. ఆత్మహత్య అని.. కాదు హత్య అంటూ సాగుతున్న చర్చ పలు సందేహాలకుతావిస్తోంది.

సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయనతో మహిళకు స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల క్రితం విశాఖకు వచ్చిన శ్రీధర్ ఆ హోటల్ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఎన్ఆర్ఐ మహిళ ద్వారకానగర్ లోని ఒక ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంట్ చేసుకోవటానికి ఇటీవల అమెరికా నుంచి వచ్చారు.

ఆమె కూడా శ్రీధర్ ఉంటున్న హోటల్ గదిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలోని షవర్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా శ్రీధర్ ఫిర్యాదు చేసినట్లుగా విశాఖ త్రీ టవున్ సీఐ చెబుతున్నారు. బాత్రూంలో ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవని.. ఆమె అనారోగ్యంతో మరణించినట్లుగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. డాక్టర్ శ్రీధర్ ఫోన్ లో ఉన్న మహిళ వీడియోలపై వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా సమాచారం.

ఈ క్రమంలో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే హత్యకు గురయ్యారా? అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం టైంకు డెడ్ బాడీ ఉబ్బిపోయి ఉండటం.. దుర్వాసన వస్తోందని మార్చురీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మహిళ భర్త అమెరికా నుంచి విశాఖకు రానున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ మరణం వెనుకున్న అసలు కారణం బయటకు రావటం ఖాయమంటున్నారు. ఈ అనుమానాస్పద మరణం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on March 9, 2025 11:35 am

Share
Show comments
Published by
Satya
Tags: nri woman

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

2 hours ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

2 hours ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

4 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

4 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

5 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

5 hours ago