విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని ఒక హోటల్ గదిలో మరణించిన ఎన్ఆర్ఐ మహిళ ఉదంతం షాకింగ్ గా మారింది. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉండటం.. భర్త.. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ అంశాన్ని పోలీసులు సైతం సీక్రెట్ గా ఉంచటం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం ఆమె మరణిస్తే.. శనివారం వెలుగు చూడటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఆమె మరణం సహజ మరణమని.. ఆత్మహత్య అని.. కాదు హత్య అంటూ సాగుతున్న చర్చ పలు సందేహాలకుతావిస్తోంది.
సీతమ్మధారకు చెందిన మహిళ (48) అమెరికాలో స్థిరపడ్డారు. నగరానికి చెందిన డాక్టర్ శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. ఆయనతో మహిళకు స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. నెల క్రితం విశాఖకు వచ్చిన శ్రీధర్ ఆ హోటల్ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఎన్ఆర్ఐ మహిళ ద్వారకానగర్ లోని ఒక ప్రైవేటు స్థలం లీజ్ అగ్రిమెంట్ చేసుకోవటానికి ఇటీవల అమెరికా నుంచి వచ్చారు.
ఆమె కూడా శ్రీధర్ ఉంటున్న హోటల్ గదిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాత్రూంలోని షవర్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లుగా శ్రీధర్ ఫిర్యాదు చేసినట్లుగా విశాఖ త్రీ టవున్ సీఐ చెబుతున్నారు. బాత్రూంలో ఉరి వేసుకున్న ఆనవాళ్లు లేవని.. ఆమె అనారోగ్యంతో మరణించినట్లుగా మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. డాక్టర్ శ్రీధర్ ఫోన్ లో ఉన్న మహిళ వీడియోలపై వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లుగా సమాచారం.
ఈ క్రమంలో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే హత్యకు గురయ్యారా? అన్నది తేలాల్సి ఉంది. పోస్టుమార్టం టైంకు డెడ్ బాడీ ఉబ్బిపోయి ఉండటం.. దుర్వాసన వస్తోందని మార్చురీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మహిళ భర్త అమెరికా నుంచి విశాఖకు రానున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కానీ మరణం వెనుకున్న అసలు కారణం బయటకు రావటం ఖాయమంటున్నారు. ఈ అనుమానాస్పద మరణం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 9, 2025 11:35 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…