స్పేస్ ఎక్స్ భారీ ప్రాజెక్ట్ స్టార్షిప్ మరోసారి విఫలమైంది. ఎనిమిదో టెస్ట్ ఫ్లైట్లో భాగంగా ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ స్పేస్లో పేలి, దాని శకలాలు ఫ్లోరిడా, బహామాస్ ప్రాంతాల్లో కూలిపోయాయి. ఈ రాకెట్ ఉపగ్రహ ప్రక్షేపణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, నాలుగు డమ్మీ స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమైంది. కానీ అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిసేపటికే అది విఫలమై శిథిలాలుగా మారింది.
ఇది జనవరిలో జరిగిన మరో ఫెయిల్యూర్కు కొనసాగింపుగా మారింది. అప్పట్లో కూడా స్టార్షిప్ పై స్టేజ్ క్యారిబియన్ సముద్రం మీదుగా పేలిపోగా, దాని శకలాలు టర్క్స్ & కైకోస్ దీవుల మీద పడిన ఘటన జరిగింది. ఆ ప్రమాదం అనంతరం స్పేస్ ఎక్స్ ఇంధన సరఫరా లైన్లు, అగ్నిప్రమాదాలను తగ్గించే వాల్వ్ వ్యవస్థను మెరుగుపరిచినప్పటికీ, తాజా విఫలం మరిన్ని సవాళ్లను తెచ్చింది. ఈసారి రాకెట్ స్పేస్లో చేరిన తర్వాత పేలిపోయింది. ఫ్లోరిడా, బహామాస్ ప్రజలు ఆకాశం నుంచి శకలాలు పడినట్లు నివేదించారు.
ఈ ఘటన కారణంగా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (FAA) వెంటనే మియామి, ఆర్లాండో, ఫోర్ట్ లాడర్డేల్, పాల్ బీచ్ విమానాశ్రయాల్లో విమాన ప్రయాణాలను నిలిపివేసింది. దాదాపు గంట తర్వాత ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ, ప్రయాణాల్లో 45 నిమిషాల వరకు జాప్యం జరిగింది. FAA అధికారికంగా ప్రకటిస్తూ, ఈ మిషన్ వైఫల్యంపై స్పేస్ ఎక్స్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని స్పష్టంచేసింది.
ఈ కఠిన పరిస్థితుల్లోనూ స్పేస్ ఎక్స్ తమ స్టార్షిప్ ప్రాజెక్టును కొనసాగించే ప్రయత్నాల్లో ఉంది. చంద్రుడిపై, మార్స్పై భవిష్యత్ మానవ ప్రయాణాలను సాధ్యమయ్యేలా రియూజబుల్ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేయడమే వారి లక్ష్యం. అయితే, వరుస వైఫల్యాలు ఈ ప్రాజెక్ట్పై నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాబోయే టెస్టుల్లో ఈ సమస్యలను అధిగమిస్తారా లేదా అనే ప్రశ్న స్పేస్ పరిశ్రమను ఉత్కంఠకు గురిచేస్తోంది.
This post was last modified on March 7, 2025 9:59 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…