ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అక్కడ ఒక కొత్త టీవీ కొనాలన్నా సరే, అది ప్రభుత్వ అనుమతితోనే కొనాలి. టీవీని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ప్రభుత్వం తరఫు అధికారులు వచ్చి అన్ని యాంటెన్నాలను తొలగించి, ఒకే ఒక్క యాంటెన్నా మిగిల్చేస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ అనుమతినిచ్చిన ఛానళ్ మాత్రమే చూడాలి. టీవీలో 24 గంటలూ కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని ప్రశంసించే ప్రోగ్రామ్లు, పాటలు, డాక్యుమెంటరీలు మాత్రమే ప్రసారం అవుతాయి.
టీవీలే కాదు, సాధారణంగా చిన్న పిల్లలు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు రకాలు మాత్రమే లభిస్తాయి. దాని కంటే ఒక్క సెంటీమీటర్ ఎక్కువ జుట్టు పెంచినా తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచి కఠినంగా హెచ్చరిస్తారు. ప్రతి జాతీయ పండుగకు ప్రజలు తప్పనిసరిగా కిమ్ కుటుంబ విగ్రహాల వద్ద మోకాళ్ల మీద వంగి నమస్కరించాలి. ఈ ఆచారాలను ఎవరైనా పాటించకపోతే వారి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
నార్త్ కొరియాలో జన్మించి అక్కడి కఠిన నియమాల నుంచి తప్పించుకోవడం చాలా అరుదైన విషయం. 1950ల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి తప్పించుకుని దక్షిణ కొరియా, చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లగలిగారు. టిమోతి చో కూడా అదే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య చేసినా అక్కడి ప్రజలకు తీవ్ర శిక్షలు విధిస్తారు. ఈ నేపథ్యంలో, నార్త్ కొరియాలో జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే.. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ప్రజలకు తెలియదు.
This post was last modified on March 7, 2025 9:40 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…