ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అక్కడ ఒక కొత్త టీవీ కొనాలన్నా సరే, అది ప్రభుత్వ అనుమతితోనే కొనాలి. టీవీని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ప్రభుత్వం తరఫు అధికారులు వచ్చి అన్ని యాంటెన్నాలను తొలగించి, ఒకే ఒక్క యాంటెన్నా మిగిల్చేస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ అనుమతినిచ్చిన ఛానళ్ మాత్రమే చూడాలి. టీవీలో 24 గంటలూ కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని ప్రశంసించే ప్రోగ్రామ్లు, పాటలు, డాక్యుమెంటరీలు మాత్రమే ప్రసారం అవుతాయి.
టీవీలే కాదు, సాధారణంగా చిన్న పిల్లలు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు రకాలు మాత్రమే లభిస్తాయి. దాని కంటే ఒక్క సెంటీమీటర్ ఎక్కువ జుట్టు పెంచినా తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిచి కఠినంగా హెచ్చరిస్తారు. ప్రతి జాతీయ పండుగకు ప్రజలు తప్పనిసరిగా కిమ్ కుటుంబ విగ్రహాల వద్ద మోకాళ్ల మీద వంగి నమస్కరించాలి. ఈ ఆచారాలను ఎవరైనా పాటించకపోతే వారి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
నార్త్ కొరియాలో జన్మించి అక్కడి కఠిన నియమాల నుంచి తప్పించుకోవడం చాలా అరుదైన విషయం. 1950ల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి తప్పించుకుని దక్షిణ కొరియా, చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లగలిగారు. టిమోతి చో కూడా అదే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య చేసినా అక్కడి ప్రజలకు తీవ్ర శిక్షలు విధిస్తారు. ఈ నేపథ్యంలో, నార్త్ కొరియాలో జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే.. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ప్రజలకు తెలియదు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…