Trends

నార్త్ కొరియా నుండి తప్పించుకున్న వ్యక్తి షాకింగ్ నిజాలు వెల్లడి!

ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించారు.

అక్కడ ఒక కొత్త టీవీ కొనాలన్నా సరే, అది ప్రభుత్వ అనుమతితోనే కొనాలి. టీవీని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ప్రభుత్వం తరఫు అధికారులు వచ్చి అన్ని యాంటెన్నాలను తొలగించి, ఒకే ఒక్క యాంటెన్నా మిగిల్చేస్తారు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ అనుమతినిచ్చిన ఛానళ్ మాత్రమే చూడాలి. టీవీలో 24 గంటలూ కిమ్ జాంగ్ ఉన్ కుటుంబాన్ని ప్రశంసించే ప్రోగ్రామ్‌లు, పాటలు, డాక్యుమెంటరీలు మాత్రమే ప్రసారం అవుతాయి.

టీవీలే కాదు, సాధారణంగా చిన్న పిల్లలు ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మూడు రకాలు మాత్రమే లభిస్తాయి. దాని కంటే ఒక్క సెంటీమీటర్ ఎక్కువ జుట్టు పెంచినా తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిచి కఠినంగా హెచ్చరిస్తారు. ప్రతి జాతీయ పండుగకు ప్రజలు తప్పనిసరిగా కిమ్ కుటుంబ విగ్రహాల వద్ద మోకాళ్ల మీద వంగి నమస్కరించాలి. ఈ ఆచారాలను ఎవరైనా పాటించకపోతే వారి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.

నార్త్ కొరియాలో జన్మించి అక్కడి కఠిన నియమాల నుంచి తప్పించుకోవడం చాలా అరుదైన విషయం. 1950ల నుంచి ఇప్పటి వరకు 30,000 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి తప్పించుకుని దక్షిణ కొరియా, చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లగలిగారు. టిమోతి చో కూడా అదే ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య చేసినా అక్కడి ప్రజలకు తీవ్ర శిక్షలు విధిస్తారు. ఈ నేపథ్యంలో, నార్త్ కొరియాలో జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే.. నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో ప్రజలకు తెలియదు.

Kumar

Recent Posts

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

28 minutes ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

3 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

7 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

7 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

9 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

9 hours ago