Trends

గుడ్ న్యూస్… యూపీఐ ద్వారా PF నగదు

ఉద్యోగ భవిష్య నిధి (EPF) ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని సొమ్మును పొందడానికి కొన్ని రోజులు పడుతుండగా, త్వరలోనే ఈ ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని సులభతరం చేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ATM – UPI ద్వారా కూడా నగదు పొందే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పు వల్ల అత్యవసర సమయంలో ఉద్యోగులకు తక్షణ సాయం అందే అవకాశం ఉంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ఓ ప్రకటనలో, పీఎఫ్ సొమ్మును ఏటీఎం ద్వారా ఉపసంహరించే విధానాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఉపసంహరణ జరిగే విధానంలో, కొత్తగా ఏటీఎం ఉపసంహరణను ప్రవేశపెడితే ఉద్యోగులకు మరింత సౌలభ్యం కలుగనుంది. ఇకపై ఖాతాదారులు తాము కోరిన సమయానికే, ఏటీఎం మిషన్ ద్వారా తమ నిధిని సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ కూడా త్వరలో ప్రారంభం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతుండగా, మే లేదా జూన్ నాటికి ఈ కొత్త సౌకర్యాన్ని అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌ల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును నేరుగా వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకునే వీలుంటుంది.

అయితే, ఈ విధానంలో నగదు ఉపసంహరణకు ఏమైనా పరిమితి విధిస్తారా? రోజుకు ఎంత మొత్తాన్ని తీసుకోవచ్చు? వంటి విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా మారినప్పటికీ, ఉద్యోగ భవిష్య నిధిని నిర్దేశిత అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తరచుగా నగదు ఉపసంహరించుకుంటే భవిష్యత్తులో ఉద్యోగులకు నష్టమే కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు మంచి అవకాశాన్ని అందించనుంది. అత్యవసర అవసరాల్లో పీఎఫ్ ఉపసంహరణ సులభతరమైన మార్గాన్ని అందించడంతో పాటు, దీని ఉపయోగాన్ని జాగ్రత్తగా వినియోగించుకునేలా అవగాహన కల్పించడం కూడా అవసరం. వచ్చే రోజుల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, లక్షలాది మంది ఉద్యోగులకు తక్షణ సాయం అందే అవకాశం ఉంది.

Kumar

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

45 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

1 hour ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago