Trends

గుడ్ న్యూస్… యూపీఐ ద్వారా PF నగదు

ఉద్యోగ భవిష్య నిధి (EPF) ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని సొమ్మును పొందడానికి కొన్ని రోజులు పడుతుండగా, త్వరలోనే ఈ ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని సులభతరం చేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ATM – UPI ద్వారా కూడా నగదు పొందే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పు వల్ల అత్యవసర సమయంలో ఉద్యోగులకు తక్షణ సాయం అందే అవకాశం ఉంది.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ఓ ప్రకటనలో, పీఎఫ్ సొమ్మును ఏటీఎం ద్వారా ఉపసంహరించే విధానాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఉపసంహరణ జరిగే విధానంలో, కొత్తగా ఏటీఎం ఉపసంహరణను ప్రవేశపెడితే ఉద్యోగులకు మరింత సౌలభ్యం కలుగనుంది. ఇకపై ఖాతాదారులు తాము కోరిన సమయానికే, ఏటీఎం మిషన్ ద్వారా తమ నిధిని సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుంది.

అంతేకాదు, యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణ కూడా త్వరలో ప్రారంభం కానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో ఈపీఎఫ్ఓ చర్చలు జరుపుతుండగా, మే లేదా జూన్ నాటికి ఈ కొత్త సౌకర్యాన్ని అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపు యాప్‌ల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును నేరుగా వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకునే వీలుంటుంది.

అయితే, ఈ విధానంలో నగదు ఉపసంహరణకు ఏమైనా పరిమితి విధిస్తారా? రోజుకు ఎంత మొత్తాన్ని తీసుకోవచ్చు? వంటి విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా మారినప్పటికీ, ఉద్యోగ భవిష్య నిధిని నిర్దేశిత అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తరచుగా నగదు ఉపసంహరించుకుంటే భవిష్యత్తులో ఉద్యోగులకు నష్టమే కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి, కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు మంచి అవకాశాన్ని అందించనుంది. అత్యవసర అవసరాల్లో పీఎఫ్ ఉపసంహరణ సులభతరమైన మార్గాన్ని అందించడంతో పాటు, దీని ఉపయోగాన్ని జాగ్రత్తగా వినియోగించుకునేలా అవగాహన కల్పించడం కూడా అవసరం. వచ్చే రోజుల్లో ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, లక్షలాది మంది ఉద్యోగులకు తక్షణ సాయం అందే అవకాశం ఉంది.

Kumar

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

1 hour ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

5 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

8 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

9 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

11 hours ago