టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన బ్యాటింగ్ ప్రెజెన్స్తో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా, స్టేడియంలోని వీరాభిమానుల్లో ఒకరుగా కనిపించిన జాస్మిన్ వాలియా, హార్దిక్కు ప్రత్యేకంగా హార్దిక అభినందనలు తెలిపిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆమె హార్దిక్ సిక్సర్లకు స్టాండ్స్లోంచి చప్పట్లు కొడుతూ అతనికి మద్దతు ఇచ్చింది.
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. కేవలం 28 పరుగులే చేసినా, అందులో మూడు సిక్సులు ఉండటంతో ఆట రసవత్తరంగా మారింది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ సిక్సులు కొట్టిన సమయంలో స్టేడియంలోని కెమెరాలు జాస్మిన్ వైపు తిరగడం విశేషం. ఆమె ఆనందంతో చప్పట్లు కొట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్షణాలు హార్దిక్ బ్యాటింగ్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.
ఇతర కారణాలతోనూ హార్దిక్ పేరు వార్తల్లో నిలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియాకు ఎదురైన ఓటమికి చిన్న ప్రతీకారం తీర్చుకున్నట్లు ఈ విజయం కనిపించింది. అదే సమయంలో, హార్దిక్ మాజీ భార్య నటాషా స్టాన్కోవిచ్ పుట్టినరోజు జరుపుకుంటుండడం సోషల్ మీడియాలో మరో చర్చకు దారి తీసింది. ఆమె తన కొడుకు అగస్త్యతో కలిసి సింపుల్ బర్త్డే సెలబ్రేషన్ జరిపినట్లు వార్తలు వచ్చాయి.
హార్దిక్, జాస్మిన్ మధ్య రిలేషన్ గురించి గతేడాది నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి. నటాషా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్, జాస్మిన్ లైఫ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి కనిపిస్తూ ఉన్నప్పటికీ, అధికారికంగా బయటికి రావడం ఇదే తొలిసారి. జాస్మిన్ స్టేడియంలో ప్రత్యక్షంగా హార్దిక్కు మద్దతుగా ఉండటం, వారి బంధాన్ని బహిరంగంగా అంగీకరించినట్లే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. మరి హార్దిక్ ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…