Trends

కుంభమేళా… మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు?

ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమాగమంగా పేరుగాంచిన మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి భక్తుల రద్దీ గత రికార్డులను అధిగమించి, 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ఆధ్యాత్మికత, భక్తి, సంస్కృతీ సమ్మేళనంగా కొనసాగిన ఈ మహాకుంభమేళా మరికొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మహాకుంభమేళా ముగిసిన వెంటనే భక్తుల మనసులో వచ్చే ప్రశ్న – తదుపరి కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ?.. అయితే వచ్చే కుంభమేళా 2027లో మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగనుంది. ఇది జులై 17 నుంచి ఆగస్టు 17 వరకు జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. నాసిక్‌కు 38 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో గోదావరి నదీ తీరంలో ఈ మేళా జరగనుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర శివాలయం ఇక్కడే ఉండడం వల్ల ఈ మేళాకు మరింత ప్రాముఖ్యత ఉంది. ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మరింత విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

కుంభమేళా పద్ధతి గురించి తెలిసిన వారు ఈ మేళా మళ్ళీ మూడేళ్లకే మరోసారి ఎందుకు వస్తోందో అని ప్రశ్నించవచ్చు. అయితే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే, 12 ఏళ్లకు ఒకసారి జరిగేదే పూర్తి కుంభమేళాగా పరిగణిస్తారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మేళానే మహాకుంభమేళాగా పిలుస్తారు. ఈసారి ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ముగిసిన నేపథ్యంలో, 2027 నాటికి నాసిక్‌లో జరిగే మేళా సాధారణ కుంభమేళాగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులే కాకుండా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈసారి మహాకుంభమేళాకు హాజరయ్యారు.

అంతర్జాతీయంగా కూడా ఈ మహాసభ ప్రాధాన్యతను పెంచుతూ, 77 దేశాలకు చెందిన 118 మంది దౌత్యవేత్తలు ఈ మహా మేళాలో భాగమయ్యారు. మొత్తంగా, 2025 మహాకుంభమేళా భక్తులకు స్మరణీయంగా నిలిచిపోయింది. అయితే, ఈ పవిత్ర మహోత్సవాన్ని మళ్లీ అనుభవించాలనుకునే భక్తులు 2027 నాటికి నాసిక్‌లో జరిగే కుంభమేళాకి సిద్ధమవ్వవచ్చు.

This post was last modified on March 1, 2025 4:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

11 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago