ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా గత నెల రోజుల క్రితం మూడు విమాన ప్రమాదాలు అమెరికాను షాక్ కు గురి చేసింది. ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడనంత ప్రాణనష్టం కూడా జరిగింది. అయితే రీసెంట్ గా అమెరికాలోని చికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది.
ఒక ప్రయాణికుల విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ జెట్ అదే రన్వేపైకి ప్రవేశించింది. చివరి క్షణంలో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ల్యాండింగ్ను రద్దు చేయడంతో, పెనుప్రమాదం తప్పింది. స్వౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ 2504 విమానం ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా, తెల్లని ప్రైవేట్ జెట్ రన్వేపై కనిపించింది. వెంటనే పైలట్ ల్యాండింగ్ను రద్దు చేసి, విమానాన్ని మళ్లీ పైకెత్తి వేగంగా ఎగరబెట్టాడు.
విమానం కేవలం 50 అడుగుల దూరంలోనే నేలను తాకే ప్రమాదంలో ఉండగా, ఈ శరవేగ నిర్ణయం తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనలో ప్రైవేట్ జెట్ పైలట్ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పునరుద్ఘాటించినా, రన్వేపైకి ప్రవేశించొద్దని తొమ్మిది సార్లు హెచ్చరించినా, ప్రైవేట్ జెట్ పైలట్ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం గమనార్హం. ఇది మరింత ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించగా, స్వౌత్వెస్ట్ పైలట్ సమయస్ఫూర్తితో స్పందించడంతో భారీ ముప్పు తప్పింది.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) విచారణ మొదలుపెట్టాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, ఈ ఘటన విమాన ప్రయాణ భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ముందే తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఇలాంటి ఘోర ప్రమాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on February 26, 2025 4:42 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…