Trends

భూమిని ఢీకొట్టే గ్రహశకలం.. మరో క్లారిటీ ఇచ్చిన నాసా

ఇటీవల అంతరిక్ష పరిశోధకులు భూమి వైపుగా దూసుకొస్తున్న 2024 వైఆర్ 4 అనే గ్రహశకలాన్ని గుర్తించారు. ఈ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా మొదట హెచ్చరించింది. దాని ప్రకారం, ప్రాథమిక విశ్లేషణలలో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశాలు 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

తర్వాతి రోజుల్లో నాసా మరిన్ని పరిశీలనలు చేపట్టి, ముప్పు శాతం క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 19న జరిగిన విశ్లేషణలో 1.5 శాతంగా, అదే నెల 24న 0.002 శాతానికి తగ్గినట్లు తెలిపారు. చివరికి, భూమికి ఎటువంటి ముప్పు లేదని, ఈ గ్రహశకలం భూమిని దాటిపోతుందని స్పష్టంగా ప్రకటించారు. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది.

2024 డిసెంబర్ 27న చిలీ పరిశోధకులు ఈ గ్రహశకలాన్ని మొదట గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలం సుమారు 50 మీటర్ల వ్యాసం కలిగినదని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని లోపలి నిర్మాణం, మూలకాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుతో మార్చి, మే నెలల్లో పరిశీలనలు కొనసాగిస్తామని తెలిపారు.

మొత్తానికి, 2024 వైఆర్ 4 అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం లేదని నాసా స్పష్టత ఇచ్చింది. అయితే, ఇది 2028 జూన్ లో మళ్లీ భూమికి దగ్గరగా వస్తుందని, అప్పటి పరిస్థితులను పరిగణనలో ఉంచుకుని నిరంతరం నిఘా కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చేశారు.

This post was last modified on February 25, 2025 3:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago