Trends

ప‌బ్లిసిటీ స్టంట్: తెలుగు సెలబ్స్ పై రాయుడు కామెంట్స్‌

టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్, ఏపీకి చెందిన అంబ‌టి రాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప‌బ్లిసిటీ “స్టంట్ కోస‌మే కొంద‌రు పాకిస్థాన్‌-ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు”- అని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీక‌న్నా.. త‌క్కువ అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు-అని అంబ‌టి రాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

దుబాయ్‌లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌.. దాయాది దేశాలైన భార‌త్‌-పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ రెండు జ‌ట్ల‌కు ఉండే క్రేజ్ ఎంతో అంద‌రికీ తెలిసిందే. పైగా విదేశీ గ‌డ్డ‌పై అందునా ఛాంపియ‌న్స్ ట్రోఫీ కావ‌డంతో ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. దీనిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని అనేక మంది అనుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు కూడా ఉన్నారు. అయితే.. కొంద‌రు టికెట్లు దొర‌క్క ఆగిపోయారు. మ‌రికొంద‌రు ద‌క్కించుకుని క్రికెట్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. భార‌త్ గెలుపును ఆస్వాదించారు. గ‌ర్వంగా ఫీల‌య్యారు.

ఇలా.. దుబాయ్‌కు వెళ్లి ప్ర‌త్య‌క్షంగా క్రికెట్‌ను వీక్షించిన వారిలో ప్ర‌ముఖ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి, పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఏపీ మంత్రి, యువ నాయ‌కుడు నారా లోకేష్‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని వంటి తెలుగు వారు కూడా ఉన్నారు. అయితే.. వీరిని ఉద్దేశించి.. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్. అందుకే వస్తారు” అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు గుప్పించాడు.

ఈ వ్యాఖ్య‌లు క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. అంబ‌టి పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి దుబాయ్ వ‌చ్చి.. క్రీడ‌ను వీక్షించిన వారి ప‌ట్ల ఇంత నీచ‌మైన వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ.. వ్యాఖ్యానించా రు. మ‌రికొందరు “నువ్వు తోప‌నుకుంటున్నావా?” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాగా.. ఈ వ్యాఖ్య‌ల‌పై చిరు, సుకుమార్‌, నారా లోకేష్ స్పందించ‌లేదు.

This post was last modified on February 24, 2025 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

8 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

9 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

10 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

12 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

12 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

12 hours ago