Trends

ప‌బ్లిసిటీ స్టంట్: తెలుగు సెలబ్స్ పై రాయుడు కామెంట్స్‌

టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్, ఏపీకి చెందిన అంబ‌టి రాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప‌బ్లిసిటీ “స్టంట్ కోస‌మే కొంద‌రు పాకిస్థాన్‌-ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు”- అని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీక‌న్నా.. త‌క్కువ అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు-అని అంబ‌టి రాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

దుబాయ్‌లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌.. దాయాది దేశాలైన భార‌త్‌-పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగింది. ఈ రెండు జ‌ట్ల‌కు ఉండే క్రేజ్ ఎంతో అంద‌రికీ తెలిసిందే. పైగా విదేశీ గ‌డ్డ‌పై అందునా ఛాంపియ‌న్స్ ట్రోఫీ కావ‌డంతో ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది. దీనిని ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని అనేక మంది అనుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు కూడా ఉన్నారు. అయితే.. కొంద‌రు టికెట్లు దొర‌క్క ఆగిపోయారు. మ‌రికొంద‌రు ద‌క్కించుకుని క్రికెట్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. భార‌త్ గెలుపును ఆస్వాదించారు. గ‌ర్వంగా ఫీల‌య్యారు.

ఇలా.. దుబాయ్‌కు వెళ్లి ప్ర‌త్య‌క్షంగా క్రికెట్‌ను వీక్షించిన వారిలో ప్ర‌ముఖ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి, పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఏపీ మంత్రి, యువ నాయ‌కుడు నారా లోకేష్‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని వంటి తెలుగు వారు కూడా ఉన్నారు. అయితే.. వీరిని ఉద్దేశించి.. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “ఇలాంటి మ్యాచ్‌లకు వస్తే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా, పబ్లిసిటీ స్టంట్. అందుకే వస్తారు” అని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు గుప్పించాడు.

ఈ వ్యాఖ్య‌లు క్ష‌ణాల్లో వైర‌ల్ అయ్యాయి. అంబ‌టి పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి దుబాయ్ వ‌చ్చి.. క్రీడ‌ను వీక్షించిన వారి ప‌ట్ల ఇంత నీచ‌మైన వ్యాఖ్య‌లు చేస్తావా? అంటూ.. వ్యాఖ్యానించా రు. మ‌రికొందరు “నువ్వు తోప‌నుకుంటున్నావా?” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మొత్తానికి అంబటి రాయుడు చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. కాగా.. ఈ వ్యాఖ్య‌ల‌పై చిరు, సుకుమార్‌, నారా లోకేష్ స్పందించ‌లేదు.

This post was last modified on February 24, 2025 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

6 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

9 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

9 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

10 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

10 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

12 hours ago