జీవీ రెడ్డి. గత నాలుగు రోజులుగా ఏపీ మీడియాలో ప్రముఖంగా వినిపించిన పేరు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో వైసీపీని ఎండగట్టి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రెడ్డి కొంత మేరకు కృషి చేశారు. అదేసమయంలో ఆయన చర్చలు, ఇష్టాగోష్టుల పేరుతో కూడా టీడీపీకి మేలు చేశారు. దీంతో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆయన కృషిని గుర్తించిన చంద్రబాబు.. ఏకంగా కీలకమైన ఏపీ ఫైబర్ నెట్.. చైర్మన్ గిరీ అప్పగించారు.
అయితే.. ఈ పదవిని చేపట్టిమూడు మాసాలు కూడా కాకుండానే.. రెడ్డిగారు వివాదాలకు కేంద్రంగా మారిపో యారు. ఉన్నత విద్యావంతుడు, మేధావి అనే కారణంగా చంద్రబాబు ఆయనకు పదవి ఇస్తే.. సర్కారునే రోడ్డున పడేలా వ్యవహరించడం .. కూటమిని కుదిపేసింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్కుమార్పై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ఐఏఎస్ సంఘం తీవ్రంగా ఆక్షేపించింది. పైగా సీఎం చంద్రబాబుకు కూడా.. ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు రెడ్డిగారిని మందలించారు. నువ్వు ఎంత మేధావి అయినా.. పనిలో చూపించాలని.. ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా వ్యవహరిస్తే ఎలా? అని క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు.. ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లోపాలు ఉంటాయని.. అలాగని కడుపు చించుకుంటామా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. ఇక నుంచి ఏదైనా లోపాలు ఉంటే మీడియా ముందు కాకుండా.. అంతర్గతంగా చర్చించాలని కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మరీ ముఖ్యంగా కూటమి సర్కారు వచ్చి 9 నెలలు అయినా.. ఒక్క కనెక్షన్ ఇవ్వలేదని.. వైసీపీ హయాంలో ఇచ్చిన కనెక్షన్లే ఉన్నాయని, ఒక్కరూపాయి కూడా ఆదాయం రాలేదని.. వైసీపీ హయాంలో లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్న రెడ్డిగారి వ్యాఖ్యలను చంద్రబాబు ఆక్షేపించారు. ఇలా చేయడం ద్వారా.. వైసీపీకి మేలు చేస్తున్నారా? అని సూటిగా ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎంత నిక్కచ్చి అయినా కొంత తగ్గాల్సిందేనని.. లేనిపోని ఆరోపణలతో పరువు తీయొద్దని జీవీ రెడ్డికి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. మరి ఆయన తగ్గుతారో.. లేదో చూడాలి.
This post was last modified on February 23, 2025 2:45 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…