సంచలనంగా మారిన మస్తాన్ సాయి ఉదంతానికి సంబంధించి పోలీసులు కీలక విషయాల లెక్క తేల్చారు. పెద్ద ఎత్తున మహిళల వీడియోలు వేలాదిగా అతను దాచుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలతో సదరు అమ్మాయిల్ని బ్లాక్ మొయిల్ చేసేవాడని.. పెద్ద ఎత్తున డబ్బులు గుంజేవాడని.. వేధింపులకు గురి చేసినట్లుగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఆమె ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించిన నార్సింగ్ పోలీసులు కీలక అంశాల్ని గుర్తించారు. అదే సమయంలో అతడ్ని కస్టడీలో తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా డగ్ర్స్ విషయానికి సంబంధించి మాత్రం నోరు విప్పలేదని.. ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదని తేల్చారు. డ్రగ్స్ పార్టీకి వచ్చే వారి వివరాలపై కూడా అతను సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే.. వీడియోలు చూపిస్తే.. వారి వివరాలు చెప్పగలనని చెప్పినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా.. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించగా మొత్తం ఆరుగురు యువతులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 499 వీడియోలు ఉన్నాయని.. వీటిని గడిచిన మూడేళ్లుగా దాచినట్లుగా తేల్చారు. ఆరుగురు మహిళలకు సంబంధించి.. వారు వీడియో కాల్స్ చేసినప్పుడు వారికి తెలీకుండా స్క్రీన్ రికార్డింగ్ చేశాడని.. ఇదే రీతిలో లావణ్య ఆమె స్నేహితుల్ని కూడా లోబర్చుకున్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. హార్డ్ డిస్కులో కొన్ని సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకొని.. ఇతరులు ఎవరూ తన వీడియోల్ని చూడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని గుర్తించారు.
This post was last modified on February 23, 2025 1:03 pm
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…