సంచలనంగా మారిన మస్తాన్ సాయి ఉదంతానికి సంబంధించి పోలీసులు కీలక విషయాల లెక్క తేల్చారు. పెద్ద ఎత్తున మహిళల వీడియోలు వేలాదిగా అతను దాచుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలతో సదరు అమ్మాయిల్ని బ్లాక్ మొయిల్ చేసేవాడని.. పెద్ద ఎత్తున డబ్బులు గుంజేవాడని.. వేధింపులకు గురి చేసినట్లుగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఆమె ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించిన నార్సింగ్ పోలీసులు కీలక అంశాల్ని గుర్తించారు. అదే సమయంలో అతడ్ని కస్టడీలో తీసుకొని విచారించారు. ఈ సందర్భంగా డగ్ర్స్ విషయానికి సంబంధించి మాత్రం నోరు విప్పలేదని.. ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇవ్వలేదని తేల్చారు. డ్రగ్స్ పార్టీకి వచ్చే వారి వివరాలపై కూడా అతను సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే.. వీడియోలు చూపిస్తే.. వారి వివరాలు చెప్పగలనని చెప్పినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా.. లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ ను విశ్లేషించగా మొత్తం ఆరుగురు యువతులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 499 వీడియోలు ఉన్నాయని.. వీటిని గడిచిన మూడేళ్లుగా దాచినట్లుగా తేల్చారు. ఆరుగురు మహిళలకు సంబంధించి.. వారు వీడియో కాల్స్ చేసినప్పుడు వారికి తెలీకుండా స్క్రీన్ రికార్డింగ్ చేశాడని.. ఇదే రీతిలో లావణ్య ఆమె స్నేహితుల్ని కూడా లోబర్చుకున్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. హార్డ్ డిస్కులో కొన్ని సెక్యూరిటీలను ఏర్పాటు చేసుకొని.. ఇతరులు ఎవరూ తన వీడియోల్ని చూడకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకున్న విషయాన్ని గుర్తించారు.
This post was last modified on February 23, 2025 1:03 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…