ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసక్తికరమైన విశేషాలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో రేపటి మ్యాచ్‌తో భారత్ తన జర్నీ ప్రారంభించనుంది. 1998లో నాకౌట్ ట్రోఫీగా ప్రారంభమైన ఈ టోర్నీ 2017 వరకు కొనసాగింది. 2021లో రద్దు చేసిన తర్వాత, 2025లో మళ్లీ పునరుద్ధరించడం క్రికెట్ అభిమానులను ఉత్సాహంలో ముంచేసింది.

1998లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా గెలుచుకుంది. సెమీస్‌లో టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోగా, హాన్సీ క్రోనీ అద్భుత ఇన్నింగ్స్, జాక్వెస్ కాలిస్ ఐదు వికెట్లతో ప్రోటీస్ జట్టు విజయం సాధించింది. 2000లో న్యూజిలాండ్ కివీస్ తన తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది, ఆ ఫైనల్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.

2002లో వర్షం కారణంగా భారత్, శ్రీలంక ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2004లో వెస్టిండీస్ చాంపియన్‌గా అవతరించగా, 2006లో ఆస్ట్రేలియా తన తొలి ట్రోఫీని గెలుచుకుంది. ఆసీస్ 2009లో వరుసగా రెండోసారి విజయం సాధించి, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ మళ్లీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2017లో చివరి సారిగా జరిగిన టోర్నీలో పాకిస్తాన్ భారత్‌ను 180 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు 2025లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.