రణవీర్ అహ్మదిబాదీ…ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా… ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక కాలం యువతకు ప్రతినిధిగా తనను తాను చెప్పుకునే రణవీర్.. హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రుల శృంగారంపై అసందర్భ వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నాడు. ఆపై తప్పు తెలుసుకుని బహిరగంగానే సారీ కూడా చెప్పాడు. రణవీర్ చెప్పిన సారీని జనం అంగీకరింంచలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిన్నటిదాకా యమా యాక్టివ్ గా సాగిన రణవీర్ ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు.
శనివారం రణవీర్ సోషల్ మీడియా వాల్ పై కనిపించిన ఓ పోస్ట్… అతడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. సదరు పోస్టులో తనకు ఎలాంటి బెదిరింపులు ఎదురవుతున్న విషయంతో పాటుగా తనకు జరిగిన నష్టాన్ని కూడా రణవీర్ వివరించాడు.
తల్లిదండ్రుల శృంగారం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని మొదలుపెట్టిన రణవీర్… అందుకు గాను తన తప్పును తెలుసుకుని సారీ చెప్పానని తెలిపాడు. అయితే ఆ తర్వాత తనను టార్గెట్ చేస్తూ పలు వర్గాలు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయాడు. ఈ తరహా బెదిరింపులు అంతకంతకూ పెరుగుతున్నాయని కూడా తెలిపాడు.
తనపై ఉన్న కోపాన్ని తన కుటుంబంపైనా చూపుతున్నారంటూ రణవీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్న కొదంరు వ్యక్తులు తన కుటుంబ సభ్యులను కూడా వదలబోమంటూ బెదిరిస్తున్నారని తెలిపాడు. ఇక తన తల్లి నిర్వహిస్తున్న క్లినిక్ ను టార్గెట్ చేసిన కొందరు వ్యక్తులు.. రోగుల మాదిరిగా అందులోకి దూరి దానిని సర్వనాశనం చేశారని తెలిపాడు.
ఈ పరిణామాలతో తాను వణికిపోతున్నానని తెలిపాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నాడు. అయినా తానేమీ ఎక్కడికీ పారిపోనని, ఎలాంటి పరిణామాలు అయినా ధైర్యంగానే ఎదుర్కొంటానని తెలిపాడు. భారత దేశ పోలీసులు, న్యాయ వ్యవస్థపై తనకు అపార నమ్మకం ఉందని అతడు తెలిపాడు.
This post was last modified on February 15, 2025 10:29 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…