Trends

“నేను ఎక్కడికి పారిపోలేదు” : రణ్వీర్

రణవీర్ అహ్మదిబాదీ…ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా… ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక కాలం యువతకు ప్రతినిధిగా తనను తాను చెప్పుకునే రణవీర్.. హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు.

తల్లిదండ్రుల శృంగారంపై అసందర్భ వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నాడు. ఆపై తప్పు తెలుసుకుని బహిరగంగానే సారీ కూడా చెప్పాడు. రణవీర్ చెప్పిన సారీని జనం అంగీకరింంచలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిన్నటిదాకా యమా యాక్టివ్ గా సాగిన రణవీర్ ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు.

శనివారం రణవీర్ సోషల్ మీడియా వాల్ పై కనిపించిన ఓ పోస్ట్… అతడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. సదరు పోస్టులో తనకు ఎలాంటి బెదిరింపులు ఎదురవుతున్న విషయంతో పాటుగా తనకు జరిగిన నష్టాన్ని కూడా రణవీర్ వివరించాడు.

తల్లిదండ్రుల శృంగారం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని మొదలుపెట్టిన రణవీర్… అందుకు గాను తన తప్పును తెలుసుకుని సారీ చెప్పానని తెలిపాడు. అయితే ఆ తర్వాత తనను టార్గెట్ చేస్తూ పలు వర్గాలు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయాడు. ఈ తరహా బెదిరింపులు అంతకంతకూ పెరుగుతున్నాయని కూడా తెలిపాడు.

తనపై ఉన్న కోపాన్ని తన కుటుంబంపైనా చూపుతున్నారంటూ రణవీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్న కొదంరు వ్యక్తులు తన కుటుంబ సభ్యులను కూడా వదలబోమంటూ బెదిరిస్తున్నారని తెలిపాడు. ఇక తన తల్లి నిర్వహిస్తున్న క్లినిక్ ను టార్గెట్ చేసిన కొందరు వ్యక్తులు.. రోగుల మాదిరిగా అందులోకి దూరి దానిని సర్వనాశనం చేశారని తెలిపాడు.

ఈ పరిణామాలతో తాను వణికిపోతున్నానని తెలిపాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నాడు. అయినా తానేమీ ఎక్కడికీ పారిపోనని, ఎలాంటి పరిణామాలు అయినా ధైర్యంగానే ఎదుర్కొంటానని తెలిపాడు. భారత దేశ పోలీసులు, న్యాయ వ్యవస్థపై తనకు అపార నమ్మకం ఉందని అతడు తెలిపాడు.

This post was last modified on February 15, 2025 10:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago