రణవీర్ అహ్మదిబాదీ…ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా… ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక కాలం యువతకు ప్రతినిధిగా తనను తాను చెప్పుకునే రణవీర్.. హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు.
తల్లిదండ్రుల శృంగారంపై అసందర్భ వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నాడు. ఆపై తప్పు తెలుసుకుని బహిరగంగానే సారీ కూడా చెప్పాడు. రణవీర్ చెప్పిన సారీని జనం అంగీకరింంచలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిన్నటిదాకా యమా యాక్టివ్ గా సాగిన రణవీర్ ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నాడు.
శనివారం రణవీర్ సోషల్ మీడియా వాల్ పై కనిపించిన ఓ పోస్ట్… అతడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితిని కళ్లకు కట్టింది. సదరు పోస్టులో తనకు ఎలాంటి బెదిరింపులు ఎదురవుతున్న విషయంతో పాటుగా తనకు జరిగిన నష్టాన్ని కూడా రణవీర్ వివరించాడు.
తల్లిదండ్రుల శృంగారం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని మొదలుపెట్టిన రణవీర్… అందుకు గాను తన తప్పును తెలుసుకుని సారీ చెప్పానని తెలిపాడు. అయితే ఆ తర్వాత తనను టార్గెట్ చేస్తూ పలు వర్గాలు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయాడు. ఈ తరహా బెదిరింపులు అంతకంతకూ పెరుగుతున్నాయని కూడా తెలిపాడు.
తనపై ఉన్న కోపాన్ని తన కుటుంబంపైనా చూపుతున్నారంటూ రణవీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్న కొదంరు వ్యక్తులు తన కుటుంబ సభ్యులను కూడా వదలబోమంటూ బెదిరిస్తున్నారని తెలిపాడు. ఇక తన తల్లి నిర్వహిస్తున్న క్లినిక్ ను టార్గెట్ చేసిన కొందరు వ్యక్తులు.. రోగుల మాదిరిగా అందులోకి దూరి దానిని సర్వనాశనం చేశారని తెలిపాడు.
ఈ పరిణామాలతో తాను వణికిపోతున్నానని తెలిపాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నాడు. అయినా తానేమీ ఎక్కడికీ పారిపోనని, ఎలాంటి పరిణామాలు అయినా ధైర్యంగానే ఎదుర్కొంటానని తెలిపాడు. భారత దేశ పోలీసులు, న్యాయ వ్యవస్థపై తనకు అపార నమ్మకం ఉందని అతడు తెలిపాడు.
This post was last modified on February 15, 2025 10:29 pm
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…