భారత క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచిన రజత్ కుమార్ జీవితంలో ఇప్పుడు విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలోని బుచ్చా బస్తీలో ఫిబ్రవరి 9న రజత్ తన ప్రియురాలు మను కశ్యప్తో కలిసి విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. తమ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతిని పొందలేక మనస్తాపానికి గురైన ఈ జంట ఆత్మహత్యను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దారుణ ఘటనలో మను కశ్యప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, రజత్ కుమార్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. రజత్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న స్థానికులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ప్రేమకథ ఇంత విషాదాంతం అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. 2022లో రిషభ్ పంత్ కారు ప్రమాదం తరువాత రజత్ కుమార్ పేరు వార్తల్లో నిలిచింది.
రూర్కీ సమీపంలో జరిగిన ఆ ప్రమాదంలో పంత్ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రజత్ కుమార్, నిషు కుమార్ కలిసి వెంటనే పరుగెత్తి వెళ్లి పంత్ను వాహనంలో నుంచి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతగా రిషభ్ పంత్ వారిద్దరికి స్కూటర్లను బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు రజత్ కుమార్ ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
కులాల తేడా కారణంగా వారి కుటుంబాలు వివాహాన్ని అంగీకరించకపోవడం ఈ ఘోర పరిణామానికి కారణమైందని అంటున్నారు. కుటుంబాల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఈ ప్రేమ జంట ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. ఇక రజత్ ప్రాణాలతో బయటపడాలని అతని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఓ ప్రాణం కాపాడిన వ్యక్తి, ఇప్పుడు తన ప్రాణం కోసం పోరాడుతుండటం భాధాకరం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.
This post was last modified on February 13, 2025 4:46 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…