ఇజ్రాయెల్ – హమాస్ ఘర్షణలో కీలక మలుపు చోటుచేసుకుంది. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని పునర్నిర్మించాలని ట్రంప్ ఇప్పటికే ప్రతిపాదించారు. పాలస్తీనియన్లు దీనికి అంగీకరించకపోతే, మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్లకు అమెరికా ఇచ్చే సహాయాన్ని నిలిపివేస్తానని స్పష్టం చేశారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్పై హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనికితోడు, బందీల విడుదలను ఆలస్యం చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్కు కఠిన హెచ్చరిక చేశారు. శనివారం నాటికి బందీలందరినీ విడుదల చేయకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన ఓవెల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, హమాస్ తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే నరకం చూపించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఇక త్వరలో ట్రంప్, జోర్దాన్ రాజు అబ్దుల్లా 2 భేటీ కానున్నారని వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల గాజాలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై మరింత రాజకీయ ఒత్తిడి పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాజా ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు 21 మంది బందీలను హమాస్ విడుదల చేసింది.
అయితే, బదులుగా ఇజ్రాయెల్ 730 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తాజా బందీల విడులపై చర్చలు సాగుతుండగా, హమాస్ ప్రకటన ఉద్రిక్తతలకు దారితీసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందన్న ఆరోపణలతో హమాస్ కొత్త కుయుక్తులను ప్రయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
This post was last modified on February 11, 2025 2:04 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…