Trends

కుంభమేళాకు వెళ్లి వస్తూ… ఏడుగురు దుర్మరణం

మహా కుంభమేళాకు వెళ్లిన హైదరాబాదీలు ప్రమాదంలో చిక్కుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా… పలువురు గాయపడ్డారు. మృతులతో పాటుగా గాయపడ్డ వారంతా.. హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. వీరంతా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్బంగా ఈ ఘటన జరిగింది.

హైదరాబాద్ లోని నాచారం పరిధిలోని కార్తికేయ నగర్, రాఘవేంద్ర నగర్‌కు చెందిన వారు ఉత్తర ప్రదేశ్ లో జరగుతున్న మహా కుంభమేళాకు బయలుదేరారు. ఇందుకోసం వీరంతా ఓ మినీ బస్సు ను అద్దెకు తీసుకున్నారు. AP29 W1525 నెంబరు కలిగి ఉన్న ఈ బస్సు ద్వారా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వీరంతా.. కుంభ మేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం అదే బస్సు లో తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి బస్సు మరి కొన్ని గంటల్లో గమ్యస్థానం చేరేదే. అయితే… రాంగ్ రూటులో వచ్చిన ఓ భారీ ట్రక్ వీరి బస్సు ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మినీ బస్సు లో ఉన్న హైదెరాబాదీల్లో ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇక బస్సు లో మిగిలి ఉన్న వారంతా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఆరుగురిని గుర్తించారు. ఆ ఆరుగురు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్‌లుగా గుర్తించినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. మరో మృతుడిని గుర్తించాల్సి ఉంది.

Satya

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

35 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago