కృత్రిమ మేధ (AI) రంగంలో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ మధ్య ఉన్న విభేదాలు మరో మలుపు తిరిగాయి. గతంలో ఓపెన్ ఏఐ సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన మస్క్, తాజాగా దానిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
చాట్ GPT ఓపెన్ ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల సంస్థగా మార్చేందుకు 97.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.5 లక్షల కోట్లు) చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన న్యాయవాది వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదనను చాటీజీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ సీఈఓ ఆల్ట్మన్ చురకలు అంటిస్తూ తిరస్కరించారు.
ఈ వార్తలపై శామ్ ఆల్ట్మన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, “మీ ఆఫర్కు నో, అయితే మీరు కోరుకుంటే మేము ట్విటర్ (ప్రస్తుత ‘ఎక్స్’)ని 9.74 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.85 వేల కోట్లు) కొనుగోలు చేస్తాం” అంటూ సెటైర్ వేశారు.
దీనికి మస్క్ తీవ్రంగా స్పందిస్తూ, “మోసగాడు” అంటూ ఆల్ట్మన్పై నేరుగా విమర్శలు చేశారు. ఈ ట్వీట్ల తర్వాత మస్క్, ఆల్ట్మన్ మధ్య సాగే వివాదం మరింత తీవ్రమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓపెన్ ఏఐ 2015లో మస్క్ సహకారంతో ప్రారంభమైన సంస్థ. అయితే, 2018లో మస్క్ సంస్థ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టింది.
2019 నుంచి ఈ సంస్థ 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పొందింది. మస్క్ మాత్రం, ఓపెన్ ఏఐ అసలు ఉద్దేశ్యాలకు భిన్నంగా వ్యాపార ప్రయోజనాల కోసం మైక్రోసాఫ్ట్ అనుసంధానం చేయడం తప్పేనని 2023లో కోర్టుకు వెళ్లారు.
ఇటీవల మస్క్, ఆల్ట్మన్ మధ్య మాటల తూటాలు తూటాలుగా పేలుతున్నాయి. కృత్రిమ మేధ మాదిరిగానే వారి వ్యాపార పోటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది.
ఓపెన్ ఏఐను మస్క్ సొంతం చేసుకుంటారా? లేక ఆల్ట్మన్ తన సంస్థను మరింత బలోపేతం చేసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది. ఈ వివాదం రానున్న రోజుల్లో టెక్ రంగంలో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on February 11, 2025 1:51 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…