సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశం ఒక ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. రాజధాని గ్వాటెమాలా సిటీ సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 51 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 36 మంది పురుషులు, 15 మంది మహిళలు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ప్రమాద సమయంలో నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు మోయిసెస్ కాస్టిల్లో శివార్లలోని వంతెనపై నుంచి లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ ఘోర ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవా తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలను మరింత వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.
This post was last modified on February 11, 2025 1:33 pm
ఏపీ బీజేపీలో సీనియర్ నాయకుల మధ్య కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా.. నాకెందుకులే అని…
స్టార్ క్యాస్టింగ్ లేని చిన్న సినిమాలకు కంటెంటే బలం. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు అంతా బాగా…
ఎవరికైనా హీరోల మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. పోస్టర్లు దాచుకుంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తాం.…
పక్క భాష నటుడని కాదు కానీ మన ప్రేక్షకులకూ బాగా పరిచయమున్న ధనుష్ ని కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ప్రశంసించాలి.…
వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన…
పుష్ప 2 ది రూల్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించాక అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఏంటనే దాని…