సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలా దేశం ఒక ఘోర రోడ్డు ప్రమాదంతో విషాదంలో మునిగిపోయింది. రాజధాని గ్వాటెమాలా సిటీ సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులో మొత్తం 75 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 51 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 36 మంది పురుషులు, 15 మంది మహిళలు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ప్రమాద సమయంలో నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు మోయిసెస్ కాస్టిల్లో శివార్లలోని వంతెనపై నుంచి లోయలో పడిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ ఘోర ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవా తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలను మరింత వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమీక్షించేందుకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు.
This post was last modified on February 11, 2025 1:33 pm
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…