Trends

బీర్ ప్రియులకు చేదు వార్త

తెలంగాణలో బీర్ ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో అన్ని రకాల బీర్ ధరలు 15 శాతం పెరగనున్నాయి. ఈ పెరుగుదలపై అధికారిక ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ ధరలు అమాంతం పెరిగి, వినియోగదారులకు అదనపు భారం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వేసవి సమీపిస్తుండటంతో బీర్ డిమాండ్ పెరిగే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ ధర రూ.150 నుంచి రూ.180కు, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ రూ.160 నుంచి రూ.190కి పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రముఖ బ్రాండ్లకూ ఇదే విధంగా పెరుగుదల ఉంటుందని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఈ పెంపుతో గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ ఈ పెంపునకు సిఫారసు చేయడంతో, ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేసింది.

వినియోగదారుల పరంగా చూస్తే, ఈ ధరల పెంపు ఎవరికి మేలు చేసిందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే పలు పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలతో మద్యం ధరలు పెరిగిన తరుణంలో బీర్ల రేట్ల పెంపు కొత్త భారం మోపినట్లే. అయితే, ఎక్సైజ్ శాఖ ప్రకారం, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించడం ఖాయం. వేసవిలో బీర్ వినియోగం భారీగా పెరుగుతుందనే అంచనాతో, ఈ సమయంలో ధరలు పెంచడం వ్యాపారపరంగా వ్యూహాత్మకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి భిన్నమైన స్పందనను ఎదుర్కొంటోంది. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం ఎప్పటికైనా ఈ నిర్ణయం తీసుకునేదని ముందే ఊహించారని అంటున్నారు. కానీ, ధరల పెరుగుదల వల్ల చిన్న బ్రాండ్ బీర్ల వినియోగం పెరగొచ్చనే అభిప్రాయమూ వినిపిస్తోంది. మొత్తంగా, తెలంగాణలో బీర్ ధరల పెంపు హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభుత్వం ఆదాయం ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.

This post was last modified on February 11, 2025 10:53 am

Share

Recent Posts

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

7 minutes ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

16 minutes ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

3 hours ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

3 hours ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

5 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

6 hours ago