Trends

బీర్ ప్రియులకు చేదు వార్త

తెలంగాణలో బీర్ ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో అన్ని రకాల బీర్ ధరలు 15 శాతం పెరగనున్నాయి. ఈ పెరుగుదలపై అధికారిక ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ ధరలు అమాంతం పెరిగి, వినియోగదారులకు అదనపు భారం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వేసవి సమీపిస్తుండటంతో బీర్ డిమాండ్ పెరిగే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ ధర రూ.150 నుంచి రూ.180కు, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ రూ.160 నుంచి రూ.190కి పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రముఖ బ్రాండ్లకూ ఇదే విధంగా పెరుగుదల ఉంటుందని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఈ పెంపుతో గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ ఈ పెంపునకు సిఫారసు చేయడంతో, ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేసింది.

వినియోగదారుల పరంగా చూస్తే, ఈ ధరల పెంపు ఎవరికి మేలు చేసిందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే పలు పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలతో మద్యం ధరలు పెరిగిన తరుణంలో బీర్ల రేట్ల పెంపు కొత్త భారం మోపినట్లే. అయితే, ఎక్సైజ్ శాఖ ప్రకారం, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించడం ఖాయం. వేసవిలో బీర్ వినియోగం భారీగా పెరుగుతుందనే అంచనాతో, ఈ సమయంలో ధరలు పెంచడం వ్యాపారపరంగా వ్యూహాత్మకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి భిన్నమైన స్పందనను ఎదుర్కొంటోంది. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం ఎప్పటికైనా ఈ నిర్ణయం తీసుకునేదని ముందే ఊహించారని అంటున్నారు. కానీ, ధరల పెరుగుదల వల్ల చిన్న బ్రాండ్ బీర్ల వినియోగం పెరగొచ్చనే అభిప్రాయమూ వినిపిస్తోంది. మొత్తంగా, తెలంగాణలో బీర్ ధరల పెంపు హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభుత్వం ఆదాయం ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.

This post was last modified on February 11, 2025 10:53 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

1 hour ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

7 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

7 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

11 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

15 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

15 hours ago