Trends

బీర్ ప్రియులకు చేదు వార్త

తెలంగాణలో బీర్ ప్రేమికులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షాక్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ తాజా నిర్ణయంతో అన్ని రకాల బీర్ ధరలు 15 శాతం పెరగనున్నాయి. ఈ పెరుగుదలపై అధికారిక ఉత్తర్వులను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ విడుదల చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ ధరలు అమాంతం పెరిగి, వినియోగదారులకు అదనపు భారం అయ్యే పరిస్థితి ఏర్పడింది. వేసవి సమీపిస్తుండటంతో బీర్ డిమాండ్ పెరిగే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కింగ్ ఫిషర్ ప్రీమియం బీర్ ధర రూ.150 నుంచి రూ.180కు, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బీర్ రూ.160 నుంచి రూ.190కి పెరిగే అవకాశం ఉంది. ఇతర ప్రముఖ బ్రాండ్లకూ ఇదే విధంగా పెరుగుదల ఉంటుందని అంచనా. రాష్ట్ర ఖజానాకు ఈ పెంపుతో గణనీయమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ ఈ పెంపునకు సిఫారసు చేయడంతో, ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేసింది.

వినియోగదారుల పరంగా చూస్తే, ఈ ధరల పెంపు ఎవరికి మేలు చేసిందనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికే పలు పన్నులు, ఎక్సైజ్ డ్యూటీలతో మద్యం ధరలు పెరిగిన తరుణంలో బీర్ల రేట్ల పెంపు కొత్త భారం మోపినట్లే. అయితే, ఎక్సైజ్ శాఖ ప్రకారం, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించడం ఖాయం. వేసవిలో బీర్ వినియోగం భారీగా పెరుగుతుందనే అంచనాతో, ఈ సమయంలో ధరలు పెంచడం వ్యాపారపరంగా వ్యూహాత్మకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ నిర్ణయం వినియోగదారుల నుంచి భిన్నమైన స్పందనను ఎదుర్కొంటోంది. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం ఎప్పటికైనా ఈ నిర్ణయం తీసుకునేదని ముందే ఊహించారని అంటున్నారు. కానీ, ధరల పెరుగుదల వల్ల చిన్న బ్రాండ్ బీర్ల వినియోగం పెరగొచ్చనే అభిప్రాయమూ వినిపిస్తోంది. మొత్తంగా, తెలంగాణలో బీర్ ధరల పెంపు హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రభుత్వం ఆదాయం ఏ మేరకు పెరుగుతుందో చూడాలి.

This post was last modified on February 11, 2025 10:53 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

6 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

30 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago