భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా భారత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ సుమారు 3.7 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉంది.
ఇది భూమిపై జీవం ఉద్భవించిన కాలంతో సమానమని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రాంత భౌగోళిక విశ్లేషణను ఇండియా ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు మోడలింగ్ చేసి, మొదటి భౌగోళిక మ్యాప్ను రూపొందించారు.
ఈ భౌగోళిక మ్యాప్ ద్వారా మూడు ప్రధాన భూభాగాల వివరాలు వెల్లడయ్యాయి. ఎత్తైన, గడ్డిబీడు ఉన్న ప్రాంతాలు, తక్కువ ఎత్తుగల సమతల ప్రాంతాలు, అలాగే కొద్దిపాటి మార్పులతో కూడిన మృదువైన ప్రాంతాలు. విక్రమ్ ల్యాండర్ తక్కువ ఎత్తుగల సమతల ప్రాంతంలో దిగింది.
పైగా, ల్యాండింగ్ ప్రాంతం సమీపంలో ఉన్న స్కోంబెర్గర్ క్రేటర్ నుంచి పది మీటర్ల వరకు పరిమాణం కలిగిన రాళ్ల ముక్కలు ల్యాండింగ్ ప్రాంతంలో చేరినట్లు గుర్తించారు. ముఖ్యంగా, 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 540-మీటర్ల క్రేటర్ నుంచి వచ్చిన పెద్ద బండరాళ్లతో ఈ ప్రదేశం కప్పబడి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ చేసి, భారత్ను ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలిపింది. అంతేకాకుండా, చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.
విక్రమ్ ల్యాండర్, ప్రయాణి రోవర్ల ద్వారా అత్యంత విలువైన డేటాను సేకరించి, చంద్రుని ఉపరితల నిర్మాణం, ఖనిజ సంపద, భౌగోళిక పరిణామాలను విశ్లేషించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
ఇదిలా ఉండగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన తదుపరి భారీ మిషన్ అయిన చంద్రయాన్-4 ను 2027లో ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మిషన్ లక్ష్యం చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం.
ఇందుకోసం ద్విచక్ర ఉపగ్రహ ప్రయోగ పద్ధతిని అవలంబించనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే, చంద్రుని భౌగోళిక నిర్మాణంపై మరింత లోతైన పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుంది.
This post was last modified on February 10, 2025 6:06 pm
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…