అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ జెట్, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 67 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి ఆరుగురు మరణించారు. తాజాగా అలాస్కాలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడంతో, గత ఎనిమిది రోజుల్లో అమెరికాలో మూడు ప్రమాదాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా పశ్చిమ అలాస్కాలోని నోమ్ కమ్యూనిటీకి వెళ్తున్న విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ఘటనా లో పైలట్తో సహా పది మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం శిథిలాలను సముద్రంలో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి మైక్ సలెర్నో రెస్క్యూ టీం తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టేకాఫ్ అయిన గంటలోపే విమానం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు చెప్పారు.
అలాస్కా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం, బెరింగ్ ఎయిర్కు చెందిన సెస్నా కారవాన్ అనే విమానం గురువారం ఉనల్కలేట్ నుంచి నోమ్ నగరానికి బయలుదేరింది. ఆ విమానంలో తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్నారు. అయితే, ప్రయాణానికి అనుకూలంగా వాతావరణం లేకపోవడంతో ఘటన చోటుచేసుకుంది. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ హిమపాతం, పొగమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పరిస్థితులు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. విమానం ప్రమాదానికి గల అసలు కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.
యూఎస్ కోస్ట్ గార్డ్ లెఫ్టినెంట్ కమాండర్ బెంజమిన్ మెక్ఇంటైర్ కోబుల్ మాట్లాడుతూ, ప్రమాదం కంటే ముందు విమానం నుంచి ఎలాంటి డిస్ట్రెస్ సిగ్నల్ రాలేదని చెప్పారు. సాధారణంగా, విమానాల్లో అత్యవసర లొకేటింగ్ ట్రాన్స్మిటర్ అనే ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే, ఇది ఉపగ్రహానికి సంకేతాన్ని పంపుతుంది. ఆ సిగ్నల్ ఆధారంగా కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు చేపడుతుంది. కానీ, ఈ ఘటనలో అలాంటి ఎలాంటి సంకేతాలు రాకపోవడం సందేహాలను పెంచుతోంది.
This post was last modified on February 8, 2025 1:02 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…