Trends

డిపోర్ట్ గాదలు.. యూస్ వెళ్లిన విషయం కూడా తెలియదట!

అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక ఆర్మీ విమానంలో వీరిని తరలించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే.

అయితే, వీరిలో కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారులకు కూడా ఈ విషయమై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గుజరాత్‌కు చెందిన నికితా పటేల్ అమెరికా వెళ్లిన విషయం ఇంట్లో వారికి తెలియలేదట. ఆమె తండ్రి కానుభాయ్ పటేల్ మాట్లాడుతూ, “స్నేహితులతో కలిసి యూరప్ వెళ్లానని చెప్పింది. నెల క్రితమే ఇండియా నుంచి బయల్దేరింది. అయితే, ఆమె అమెరికా వెళ్లిందని అసలు తెలియదు.

చివరిసారి ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు” అని తెలిపారు. ఇప్పుడు ఆమె డిపోర్ట్ అయినవారిలో ఉన్నట్లు తెలిసి కుటుంబం షాక్‌కు గురైందని చెప్పారు.

ఇదే తరహాలో కేతుభాయ్ పటేల్ అనే వ్యక్తి కూడా అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. సూరత్‌లో ఉన్న తన ఫ్లాట్ అమ్మేసి వెళ్లిన కేతుభాయ్, అక్కడ పట్టుబడి తిరిగి ఇండియాకు వచ్చేశాడు.

అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చట్టబద్ధంగా వెళ్లాల్సింది పోయి, అక్రమ మార్గాలను ఆశ్రయించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.

అమెరికా నుంచి పంపించబడిన వారిలో గుజరాత్‌కు చెందిన గోహిల్ కుటుంబం కూడా ఉంది. కిరణ్ సింగ్ గోహిల్ తన భార్య, కుమారుడితో కలిసి అక్రమంగా అమెరికా వెళ్లాడు. కానీ, వారిని తిరిగి పంపించేశారు. వీరు ఎప్పుడు, ఎలా వెళ్లారన్న విషయం గ్రామస్తులకు కూడా తెలియదని, ఇప్పుడే బయటపడిందని స్థానికులు చెబుతున్నారు.

“కొడుకు, కోడలు, మనవడు అమెరికా వెళ్లిన సంగతి ఇంతకాలం మాకు తెలియదు. పదిహేను రోజులుగా వాళ్లతో ఫోన్‌లో కూడా మాట్లాడలేకపోయాం” అంటూ కిరణ్ సింగ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ డిపోర్ట్ వ్యవహారంతో అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటో మరోసారి హైలైట్ అయింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా బయటకు వెళ్లడం, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి రావడం కేవలం వారి తప్పిదమే కాదు, అక్రమ వలసలపై ఉన్న అపోహల వల్లనూ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

చట్టబద్ధంగా మద్దతు లేకుండా విదేశాలకు వెళ్లే వారికి భవిష్యత్‌లో మరిన్ని కఠినమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని వలస నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on February 6, 2025 12:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago