అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక ఆర్మీ విమానంలో వీరిని తరలించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే.
అయితే, వీరిలో కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారులకు కూడా ఈ విషయమై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
గుజరాత్కు చెందిన నికితా పటేల్ అమెరికా వెళ్లిన విషయం ఇంట్లో వారికి తెలియలేదట. ఆమె తండ్రి కానుభాయ్ పటేల్ మాట్లాడుతూ, “స్నేహితులతో కలిసి యూరప్ వెళ్లానని చెప్పింది. నెల క్రితమే ఇండియా నుంచి బయల్దేరింది. అయితే, ఆమె అమెరికా వెళ్లిందని అసలు తెలియదు.
చివరిసారి ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు” అని తెలిపారు. ఇప్పుడు ఆమె డిపోర్ట్ అయినవారిలో ఉన్నట్లు తెలిసి కుటుంబం షాక్కు గురైందని చెప్పారు.
ఇదే తరహాలో కేతుభాయ్ పటేల్ అనే వ్యక్తి కూడా అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. సూరత్లో ఉన్న తన ఫ్లాట్ అమ్మేసి వెళ్లిన కేతుభాయ్, అక్కడ పట్టుబడి తిరిగి ఇండియాకు వచ్చేశాడు.
అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చట్టబద్ధంగా వెళ్లాల్సింది పోయి, అక్రమ మార్గాలను ఆశ్రయించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.
అమెరికా నుంచి పంపించబడిన వారిలో గుజరాత్కు చెందిన గోహిల్ కుటుంబం కూడా ఉంది. కిరణ్ సింగ్ గోహిల్ తన భార్య, కుమారుడితో కలిసి అక్రమంగా అమెరికా వెళ్లాడు. కానీ, వారిని తిరిగి పంపించేశారు. వీరు ఎప్పుడు, ఎలా వెళ్లారన్న విషయం గ్రామస్తులకు కూడా తెలియదని, ఇప్పుడే బయటపడిందని స్థానికులు చెబుతున్నారు.
“కొడుకు, కోడలు, మనవడు అమెరికా వెళ్లిన సంగతి ఇంతకాలం మాకు తెలియదు. పదిహేను రోజులుగా వాళ్లతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయాం” అంటూ కిరణ్ సింగ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ డిపోర్ట్ వ్యవహారంతో అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటో మరోసారి హైలైట్ అయింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా బయటకు వెళ్లడం, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి రావడం కేవలం వారి తప్పిదమే కాదు, అక్రమ వలసలపై ఉన్న అపోహల వల్లనూ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
చట్టబద్ధంగా మద్దతు లేకుండా విదేశాలకు వెళ్లే వారికి భవిష్యత్లో మరిన్ని కఠినమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని వలస నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…