Trends

డిపోర్ట్ గాదలు.. యూస్ వెళ్లిన విషయం కూడా తెలియదట!

అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక ఆర్మీ విమానంలో వీరిని తరలించారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారే.

అయితే, వీరిలో కొందరి కుటుంబ సభ్యులు అసలు తమ వాళ్లు అమెరికా వెళ్లిన సంగతే తెలియదని చెబుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారులకు కూడా ఈ విషయమై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గుజరాత్‌కు చెందిన నికితా పటేల్ అమెరికా వెళ్లిన విషయం ఇంట్లో వారికి తెలియలేదట. ఆమె తండ్రి కానుభాయ్ పటేల్ మాట్లాడుతూ, “స్నేహితులతో కలిసి యూరప్ వెళ్లానని చెప్పింది. నెల క్రితమే ఇండియా నుంచి బయల్దేరింది. అయితే, ఆమె అమెరికా వెళ్లిందని అసలు తెలియదు.

చివరిసారి ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఆ విషయం చెప్పలేదు” అని తెలిపారు. ఇప్పుడు ఆమె డిపోర్ట్ అయినవారిలో ఉన్నట్లు తెలిసి కుటుంబం షాక్‌కు గురైందని చెప్పారు.

ఇదే తరహాలో కేతుభాయ్ పటేల్ అనే వ్యక్తి కూడా అక్రమ మార్గంలో అమెరికా వెళ్లాడు. సూరత్‌లో ఉన్న తన ఫ్లాట్ అమ్మేసి వెళ్లిన కేతుభాయ్, అక్కడ పట్టుబడి తిరిగి ఇండియాకు వచ్చేశాడు.

అతని కుటుంబం ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చట్టబద్ధంగా వెళ్లాల్సింది పోయి, అక్రమ మార్గాలను ఆశ్రయించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.

అమెరికా నుంచి పంపించబడిన వారిలో గుజరాత్‌కు చెందిన గోహిల్ కుటుంబం కూడా ఉంది. కిరణ్ సింగ్ గోహిల్ తన భార్య, కుమారుడితో కలిసి అక్రమంగా అమెరికా వెళ్లాడు. కానీ, వారిని తిరిగి పంపించేశారు. వీరు ఎప్పుడు, ఎలా వెళ్లారన్న విషయం గ్రామస్తులకు కూడా తెలియదని, ఇప్పుడే బయటపడిందని స్థానికులు చెబుతున్నారు.

“కొడుకు, కోడలు, మనవడు అమెరికా వెళ్లిన సంగతి ఇంతకాలం మాకు తెలియదు. పదిహేను రోజులుగా వాళ్లతో ఫోన్‌లో కూడా మాట్లాడలేకపోయాం” అంటూ కిరణ్ సింగ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ డిపోర్ట్ వ్యవహారంతో అక్రమ వలసదారుల పరిస్థితి ఏంటో మరోసారి హైలైట్ అయింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా బయటకు వెళ్లడం, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి రావడం కేవలం వారి తప్పిదమే కాదు, అక్రమ వలసలపై ఉన్న అపోహల వల్లనూ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

చట్టబద్ధంగా మద్దతు లేకుండా విదేశాలకు వెళ్లే వారికి భవిష్యత్‌లో మరిన్ని కఠినమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని వలస నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on February 6, 2025 12:36 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

1 minute ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

5 minutes ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

3 hours ago

బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…

ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…

4 hours ago

‘అందుకే ఇండస్ట్రీని వదిలేశా’

పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…

4 hours ago

తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…

5 hours ago