Trends

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే దొంగను ఇటీవల మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన అతడు తన చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ బడా క్రిమినల్‌గా మారాడు. అయితే అతడి కేసులో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అతడు తన ప్రేయసి కోసం ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించడం. అంతేకాకుండా, ఆమెకు లక్షల రూపాయల విలువైన బహుమతులు కూడా అందించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, పంచాక్షరి స్వామి 2003లో దొంగతనాలు ప్రారంభించాడు. 2009 కల్లా అతడు భారీ స్థాయిలో దోపిడీలు చేస్తూ కోట్లాది ఆస్తిని కూడబెట్టాడు. 2014-15లో ఓ ప్రముఖ సినీ నటి పరిచయం కావడంతో ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెపై కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు, కోల్‌కతాలో రూ.3 కోట్ల విలువైన ఇల్లు కట్టించి పెట్టాడు. అంతే కాదు, ఆమె కోసం రూ.22 లక్షల విలువైన ఫిష్ అక్వేరియం కూడా కొనుగోలు చేశాడు. అయితే, 2016లో గుజరాత్ పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.

అహ్మదాబాద్‌లోని సబర్మతి జైల్లో శిక్ష పూర్తయిన తర్వాత కూడా అతడు మారలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక, మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర పోలీసులు అతడిని మళ్లీ అరెస్టు చేశారు. జైలు శిక్ష పూర్తి చేసుకున్న అనంతరం 2024లో బెంగళూరుకు వచ్చి మడివాళ ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. జనవరి 9న అక్కడ ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అతడిని, స్థానిక పోలీసులు ఇంటెలిజెన్స్ ఆధారంగా పట్టుకున్నారు. విచారణలో అతడు బెంగళూరుతో పాటు పలు నగరాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.

దర్యాప్తులో పోలీసులు అతడి వద్ద 181 గ్రాముల బంగారు బిస్కట్లు, 333 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి ఉపయోగించిన ఐరన్ రాడ్, ఫైర్ గన్‌ను కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతడు దొంగతనం చేసిన బంగారాన్ని ఫైర్ గన్‌తో కరిగించి బిస్కెట్లుగా మారుస్తూ.. వాటిని సోలాపూర్‌లోని తన ఇంట్లో దాచిపెట్టాడని తేలింది.

స్వామి తండ్రి మరణించడంతో అతని తల్లి రైల్వే శాఖలో ఉద్యోగం పొందినట్లు పోలీసులు తెలిపారు. అతడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉండటంతో, చాకచక్యంగా దొంగతనాలు చేసి పోలీసుల కంట పడకుండా ఉండేవాడు. అయితే, ఇప్పుడు అతడి నాటకాలన్నీ అంతమయ్యాయి. పోలీసులు అతడిపై మరిన్ని కేసులు నమోదు చేసి, ఆయన గత నేర చరిత్రను మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.

This post was last modified on February 4, 2025 9:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

56 minutes ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

1 hour ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

5 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

7 hours ago