Trends

‘2000 నోట్లు’ దాచేశారు.. లెక్క‌లు తీస్తున్న ఐటీ!

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగి ఈ ఏడాది జూన్ – జూలై నాటికి.. తొమ్మిదేళ్లు అవుతుంది. అవినీతి, అక్ర‌మాలు, లంచాలు, ఎన్నిక‌ల్లో ఓటర్ల కొనుగోలు ప్ర‌క్రియ‌లు వంటివాటికి అడ్డుక‌ట్ట వేయాల‌న్న ఉద్దేశంతో 2016 లో మోడీ ప్ర‌భుత్వం ఈనిర్ణ‌యం తీసుకుంది. ఆ త‌ర్వాత‌.. వాటి స్థానంలో మ‌రింత పెద్ద నోట్ల‌ను తీసుకు వ‌చ్చారు. అదే 2000 నోటు. వీటిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు.. అవినీతిమ‌రింత పెరిగింద‌న్న నిఘా విభాగాల సూచ‌న‌తో రెండేళ్ల కింద‌టే.. ఈ నోట్ల‌ను ర‌ద్దు చేశారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. 2000 నోటు చ‌లామ‌ణిలో ఉంచ‌డం కాదు.. అస‌లు ఈ నోటు జేబులో ఉంటేనే క్రిమిన‌ల్ కేసు పెట్టేలా ఉత్త‌ర్వులు ఇచ్చారు. దీంతో రాత్రికి రాత్రి సాధార‌ణ ప్ర‌జ‌లు రూ.2000 నోట్ల‌ను బ్యాంకుల‌కు జ‌మ చేశారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 2000 నోటును సాధార‌ణ ప్ర‌జ‌లు దాదాపు మ‌రిచిపోయారు. అయితే.. తాజాగా ఆర్బీఐ.. స‌రికొత్త లెక్క చెప్పింది. 2000 నోట్ల‌ను కొంద‌రు దాచేశార‌ని వెల్ల‌డించింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 31 నాటికి(అంటే రెండు కింద‌టి వ‌ర‌కు) దేశంలో 6,577 కోట్ల రూపాయ‌ల విలువైన 2000 నోట్లు ప్ర‌జ‌ల్లోనే ఉన్నాయ‌ని పేర్కొంది.

ఏ నోటును ముద్రించినా.. ఎన్ని ముద్రించామ‌న్న లెక్క ఆర్బీఐ ద‌గ్గ‌ర ఉంటుంది. దీని ప్ర‌కారం.. 2016లో ముద్రించిన 2000 నోట్ల లెక్క ప్ర‌కారం.. ఈ విష‌యం వెల్ల‌డైన‌ట్టు వివ‌రించింది. అంటే.. ఇప్ప‌టికీ 6,577 కోట్ల రూపాయ‌ల విలువైన నోట్ల‌ను కొంద‌రు దాచేసిన‌ట్టు లెక్క తేలింది. దీంతో ఈ విష‌యంపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది. గ‌తంలో దాడులు జ‌రిగిన‌ప్పుడు.. ఎవ‌రి వ‌ద్ద అయితే.. పేద్ద ఎత్తున న‌గ‌దు ప‌ట్టుబ‌డిందో వారిపైనే మ‌రోసారి దృష్టి పెట్టేందుకు సిద్ధ‌మైంద‌ని తెలుస్తోంది.

మే 2023లో చెలామణిలో ఉన్న 3.56 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లలో 98.15 % తిరిగి వ్యవస్థలోకి వచ్చాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మిగిలిన మొత్తం 2000 నోట్ల రూపంలో ఉంద‌ని.. దీనిని స్వాధీనం చేసుకుంటామ‌ని పేర్కొంది. ఇదిలావుంటే.. ఇటీవ‌ల తిరుమ‌ల శ్రీవారి హుండీలో 2000 నోట్ల క‌ట్ట‌లు ఐదు ల‌భించ‌డం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా స‌ద‌రు భ‌క్తుడిని ప‌ట్టుకోవాల‌ని భావించినా.. తిరుమ‌ల కు చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని దానిని వాయిదా వేశారు.

This post was last modified on February 4, 2025 1:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: 2000noteRBI

Recent Posts

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

9 minutes ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

29 minutes ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

2 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

2 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

3 hours ago

తారకరత్న కుటుంబాన్ని పట్టించుకోవట్లేదా?

కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…

4 hours ago