Trends

ప్రపంచకప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా.. ఎందుకలా?

గత ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో స్కోర్లు సమం కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టై కావడం.. ఐతే మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు బాదినందుకు ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ దక్కడం తెలిసిన సంగతే. అప్పుడు అందరూ న్యూజిలాండ్‌ పరిస్థితి చూసి అయ్యో అనుకున్నారు. కేవలం బౌండరీలు ఎక్కువ కొట్టినందుకు ఒక జట్టుకు ప్రపంచకప్ ఇచ్చేయడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తింది. ఈ నిబంధనను అందరూ తప్పుబట్టారు. ఇది అన్యాయం అన్నారు. ఐతే సూపర్ ఓవర్‌కు సంబంధించి నిబంధనలు ఎప్పట్నుంచో అలాగే ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్లో అయినా, ఐపీఎల్ లాంటి దేశవాళీ లీగ్‌ల్లో అయినా ఎప్పట్నుంచో అనుసరిస్తున్న పద్ధతి ఇదే. కానీ ఆదివారం రాత్రి ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మాత్రం సూపర్ ఓవర్ టై అయితే బౌండరీలు ఎక్కువ కొట్టిన జట్టును విజేతగా ప్రకటించలేదు. మళ్లీ ఒక సూపర్ ఓవర్ నిర్వహించారు.

ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ ఓవర్ నిబంధనల విషయంలో తీవ్ర విమర్శలు రావడంతో ఐసీసీ రూల్స్ మార్చింది. సూపర్ ఓవర్ సమమైతే ముందులా బౌండరీల్ని బట్టి విజేతను నిర్ణయించే నిబంధనను రద్దు చేసింది. ఆ పరిస్థితుల్లో మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహించేలా రూల్స్ మార్చింది. ఆ ప్రకారమే ఆదివారం రెండో సూపర్ ఓవర్ ఆడించారు. కాగా రెండో సూపర్ ఓవర్ విషయంలోనూ కొన్ని నిబంధనలున్నాయి.

తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన వాళ్లు రెండో సూపర్ ఓవర్లో బంతి అందుకోవడానికి వీల్లేదు. అలాగే తొలి సూపర్ ఓవర్లో ఔటైన బ్యాట్స్‌మెన్‌తో రెండోదాంట్లో బ్యాటింగ్‌కు రాకూడదు. అందుకే తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బుమ్రా, షమి కాకుండా తర్వాత జోర్డాన్, బౌల్ట్ బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే రాహుల్, పూరన్ ఔటయ్యారు కాబట్టి తర్వాత బ్యాటింగ్‌కు రాలేదు. ముంబయి జట్టులో డికాక్ ఔటయ్యాడు కాబట్టి అతను రాలేదు. రోహిత్ శర్మకు అవకాశం ఉన్నా అతను కాకుండా పొలార్డ్, హార్దిక్ పాండ్యలు బ్యాటింగ్‌కు దిగారు.

This post was last modified on October 20, 2020 8:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago