Trends

డాలర్ పై ట్రంప్ హెచ్చరిక.. భారత్‌పై ఎఫెక్ట్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఆర్థిక విధానాలను స్పష్టంగా వెల్లడించారు. తాజాగా, బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే బ్రిక్స్ దేశాలు డాలర్ డిమాండ్ ను తట్టుకోలేక కొత్త కరెన్సీని సృష్టించే ఆలోచనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విధంగా చేయకూడదని, లేదా ఏ ఇతర కరెన్సీని డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మద్దతు ఇవ్వకూడదని వారు స్పష్టంగా హామీ ఇవ్వాలని, లేకపోతే 100% టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

అంతేకాకుండా, బ్రిక్స్ దేశాలకు అమెరికాలో వ్యాపారం చేసుకునే అవకాశాలను పూర్తిగా మూసివేస్తామని, వీళ్లు మరో ‘సక్కర్ నేషన్’ (సులువుగా మోసపోయే దేశం) వెతుక్కోవాల్సి వస్తుందని కటువాక్యాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా భారత్‌కు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్‌లో భారత్ కీలకమైన సభ్యదేశం. గత కొంతకాలంగా భారత్ డాలర్ ఆధారిత వ్యవస్థను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

రష్యాతో రూపీ-రూబుల్ లావాదేవీలు, సౌదీతో రుపీ ట్రేడింగ్ చర్చలు, అంతర్జాతీయ లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌పై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతంగా ఉండటంతో, డీ-డాలరైజేషన్ దిశగా భారత్ వెళ్లే ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వ్యాపార యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలపై అమెరికా నుంచి భారీగా ఆదాయం వస్తోంది. అమెరికా ప్రతిపాదిత 100% టారిఫ్‌లు విధిస్తే, భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం పడనుంది. ఇప్పటికే ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేసిన నేపథ్యంలో, ఈసారి వాణిజ్య ఒత్తిడి పెంచితే, భారత్‌కు అమెరికా మార్కెట్‌లో పోటీ చేయడం మరింత క్లిష్టం కానుంది. అయితే భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదని, ఇటీవల యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికగానే చూడాలా? లేక వాస్తవంగా అమలయ్యే విధానమా? అనే దానిపై ప్రపంచ ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు. బ్రిక్స్ దేశాలు తమ ప్రణాళికలను నెమ్మదింపే అవకాశం ఉందని, ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చని అంచనా. భారత్ విషయానికి వస్తే, మోదీ ప్రభుత్వం అమెరికాతో తగిన మధ్యస్థత పాటిస్తూ, ఒకేసారి డీ-డాలరైజేషన్ వైపు కాకుండా, గ్లోబల్ లావాదేవీల్లో సులభతర మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Kumar

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

27 minutes ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

47 minutes ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

3 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

3 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

4 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

4 hours ago