Trends

డాలర్ పై ట్రంప్ హెచ్చరిక.. భారత్‌పై ఎఫెక్ట్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఆర్థిక విధానాలను స్పష్టంగా వెల్లడించారు. తాజాగా, బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లతో కూడిన ఇంటర్‌గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే బ్రిక్స్ దేశాలు డాలర్ డిమాండ్ ను తట్టుకోలేక కొత్త కరెన్సీని సృష్టించే ఆలోచనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విధంగా చేయకూడదని, లేదా ఏ ఇతర కరెన్సీని డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మద్దతు ఇవ్వకూడదని వారు స్పష్టంగా హామీ ఇవ్వాలని, లేకపోతే 100% టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.

అంతేకాకుండా, బ్రిక్స్ దేశాలకు అమెరికాలో వ్యాపారం చేసుకునే అవకాశాలను పూర్తిగా మూసివేస్తామని, వీళ్లు మరో ‘సక్కర్ నేషన్’ (సులువుగా మోసపోయే దేశం) వెతుక్కోవాల్సి వస్తుందని కటువాక్యాలు సంధించారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యేకంగా భారత్‌కు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్‌లో భారత్ కీలకమైన సభ్యదేశం. గత కొంతకాలంగా భారత్ డాలర్ ఆధారిత వ్యవస్థను తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది.

రష్యాతో రూపీ-రూబుల్ లావాదేవీలు, సౌదీతో రుపీ ట్రేడింగ్ చర్చలు, అంతర్జాతీయ లావాదేవీల్లో స్థానిక కరెన్సీల వినియోగంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌పై ఒత్తిడి పెంచేలా ఉన్నాయి. అమెరికా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలు విస్తృతంగా ఉండటంతో, డీ-డాలరైజేషన్ దిశగా భారత్ వెళ్లే ప్రయత్నాలు ట్రంప్ పాలనలో వ్యాపార యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలపై అమెరికా నుంచి భారీగా ఆదాయం వస్తోంది. అమెరికా ప్రతిపాదిత 100% టారిఫ్‌లు విధిస్తే, భారత ఎగుమతులపై నేరుగా ప్రభావం పడనుంది. ఇప్పటికే ట్రంప్ పాలనలో హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు అమలు చేసిన నేపథ్యంలో, ఈసారి వాణిజ్య ఒత్తిడి పెంచితే, భారత్‌కు అమెరికా మార్కెట్‌లో పోటీ చేయడం మరింత క్లిష్టం కానుంది. అయితే భారత్ పూర్తిగా అమెరికాపై ఆధారపడలేదని, ఇటీవల యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికగానే చూడాలా? లేక వాస్తవంగా అమలయ్యే విధానమా? అనే దానిపై ప్రపంచ ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు. బ్రిక్స్ దేశాలు తమ ప్రణాళికలను నెమ్మదింపే అవకాశం ఉందని, ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాలు మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించవచ్చని అంచనా. భారత్ విషయానికి వస్తే, మోదీ ప్రభుత్వం అమెరికాతో తగిన మధ్యస్థత పాటిస్తూ, ఒకేసారి డీ-డాలరైజేషన్ వైపు కాకుండా, గ్లోబల్ లావాదేవీల్లో సులభతర మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

This post was last modified on January 31, 2025 1:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

52 minutes ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

3 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

4 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

5 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

6 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

6 hours ago