ఇప్పటికే ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తాజాగా మరోసారి స్పేస్వాక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశారు. ఆమె రేడియో కమ్యూనికేషన్ హార్డ్వేర్ను తొలగించేందుకు స్పేస్స్టేషన్ వెలుపలకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మునుపటి వ్యోమగామి పెగ్గీ విట్సన్ స్థిరపరిచిన 60 గంటల 21 నిమిషాల స్పేస్వాక్ రికార్డును అధిగమించారు.
సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లినా, వ్యోమనౌకలో సాంకేతిక లోపాల వల్ల భూమికి తిరిగి రాలేకపోయారు. అప్పటి నుంచి స్టేషన్ కమాండర్గా వ్యవహరిస్తూ, అక్కడి మరమ్మతు పనులను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యోమగామి విల్మార్తో కలిసి తాజాగా మరోసారి స్పేస్వాక్ చేసి మరమ్మతుల పనులను చేపట్టారు.
ఇది సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష ప్రయాణం కాగా, ఆమె ఇప్పటివరకు మొత్తం తొమ్మిది స్పేస్వాక్లు పూర్తి చేశారు. 2012లో ఆమె చివరిసారి స్పేస్వాక్ నిర్వహించారు. ఇప్పటి వరకు 50 గంటల 40 నిమిషాల పాటు శూన్య గమనంలో గడిపిన ఆమె, తాజాగా చేసిన స్పేస్వాక్తో రికార్డు స్థాయిలో అత్యధికంగా అంతరిక్ష నడక చేసిన వ్యోమగాముల జాబితాలో మరో రికార్డ్ కు చేరుకున్నారు.
ప్రస్తుతం నాసా ఆమెను భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం శూన్య గమనంలో ఉన్న సునీతా భూమిపై అడుగు పెట్టిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on January 31, 2025 12:43 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…