Trends

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ మరో ఘనత

ఇప్పటికే ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తాజాగా మరోసారి స్పేస్‌వాక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశారు. ఆమె రేడియో కమ్యూనికేషన్ హార్డ్‌వేర్‌ను తొలగించేందుకు స్పేస్‌స్టేషన్ వెలుపలకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మునుపటి వ్యోమగామి పెగ్గీ విట్సన్ స్థిరపరిచిన 60 గంటల 21 నిమిషాల స్పేస్‌వాక్ రికార్డును అధిగమించారు.

సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఐఎస్ఎస్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లినా, వ్యోమనౌకలో సాంకేతిక లోపాల వల్ల భూమికి తిరిగి రాలేకపోయారు. అప్పటి నుంచి స్టేషన్ కమాండర్‌గా వ్యవహరిస్తూ, అక్కడి మరమ్మతు పనులను కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో వ్యోమగామి విల్మార్‌తో కలిసి తాజాగా మరోసారి స్పేస్‌వాక్ చేసి మరమ్మతుల పనులను చేపట్టారు.

ఇది సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష ప్రయాణం కాగా, ఆమె ఇప్పటివరకు మొత్తం తొమ్మిది స్పేస్‌వాక్‌లు పూర్తి చేశారు. 2012లో ఆమె చివరిసారి స్పేస్‌వాక్ నిర్వహించారు. ఇప్పటి వరకు 50 గంటల 40 నిమిషాల పాటు శూన్య గమనంలో గడిపిన ఆమె, తాజాగా చేసిన స్పేస్‌వాక్‌తో రికార్డు స్థాయిలో అత్యధికంగా అంతరిక్ష నడక చేసిన వ్యోమగాముల జాబితాలో మరో రికార్డ్ కు చేరుకున్నారు.

ప్రస్తుతం నాసా ఆమెను భూమికి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలం శూన్య గమనంలో ఉన్న సునీతా భూమిపై అడుగు పెట్టిన తర్వాత ఎలా అడ్జస్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.

This post was last modified on January 31, 2025 12:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

1 hour ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

4 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

7 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

7 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

10 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

12 hours ago