ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేలోని నోబెల్ అవార్డుల కమిటీకి యూరోపియన్ యూనియన్ నుంచి ఓ ప్రతిపాదన అందింది. వాస్తవానికి సామాజిక సేవ చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిరీత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ గా వ్యవహరిస్తూ… తనదైన వ్యూహాలతో సాగుతున్న మస్క్ ఈ అవార్డు రేసులోకి రావడం గమనార్హం.
ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ వెన్నుదన్నుగా నిలిచారు. ఎన్నికల వ్యూహ రచనతో పాటుగా ఎన్నికల ప్రచారంలోనూ స్వయంగా పాలుపంచుకున్న మస్క్..,. ట్రంప్ కు మద్దతుగా నిలిచిన వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తానంటూ బహిరంగంగానే ప్రకటించి సంచలనం రేపారు. అయితే మస్క్ వ్యాఖ్యలపై అమెరికా ఎన్నికల నియమావళి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ఎన్నికల్లో ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టగానే…అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందే మస్క్ ను తన సలహాదారుగా నియమిస్తూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా తాను తీసుకుంటున్న ప్రతి కీలక నిర్ణయాన్ని ముందుగా మస్క్ తో చర్చించిన తర్వాతే ట్రంప్ ముందుకు సాగుతున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా రాజకీయాలు, పాలనా వ్యవస్థలో మస్క్ భవిష్యత్తులో మస్క్ మరింత కీలకంగా వ్యవహరించనున్నారు.
ఇక అదే సమయంలో ఇప్పటికే విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను ఏర్పాటు చేసిన మస్క్…ఆయా దేశాల్లో తన కంపెనీ విస్తరణ కోసం నయా వ్యూహాలను అమలు చేస్తున్నారు. తనకు అమితమైన ఇష్టమున్న అంతరిక్ష రంగంలో కాలిడిన మస్క్…స్పేస్ ఎక్స్ పేరిట ఓ కంపెనీనే తెరిచారు. ఇక గతంలో ట్విట్టర్ ను హస్తగతం చేసుకునేందుకు మస్క్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా చైనా యాప్ టిక్ టాక్ ను కూడా చేజిక్కించుకునేందుకు మస్క్ తనదైన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఇదిలా ఉంటే..ప్రపంచవ్యాప్తంగా భాశ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడేందుకు మస్క్ ఎనలేని కృషి చేస్తున్నారంటూ ఇప్పుడు ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ ఓ కీలక ప్రకటన చేశారు. మరి ఈ ప్రతిపాదనకు నోబెల్ కమిటీ ఏ మేర ప్రాదాన్యం ఇస్దుందో చూడాలి.
This post was last modified on January 31, 2025 7:45 am
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…