Trends

అంతరిక్షంలో 7 నెలలు.. నడవలేక, కూర్చోలేక, పడుకోలేక!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) చేరుకున్న ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా అనేక నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి, జూన్ 14నే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, సాంకేతిక లోపల కారణంగా నాసా మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ వచ్చింది.

ఇక ఇటీవల అప్‌డేట్‌లో సునీతా తన పరిస్థితిని వివరించారు, 7 నెలలుగా నడవలేదని, కూర్చోలేదని, పడుకోలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శూన్య గురుత్వాకర్షణ ప్రభావం వల్ల తన శరీరం తేలియాడుతూనే ఉందని, భూమిపై నడిచిన అనుభూతిని కూడా గుర్తు చేసుకోలేకపోతున్నానని, నడవడం ఎలాగో గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఓ హైస్కూల్ విద్యార్థులతో వర్చువల్ సెషన్‌లో మాట్లాడిన ఆమె, అంతరిక్ష ప్రయాణం అనేది శారీరకంగా ఎంతటి సవాళ్లు విసురుతుందో వివరణ ఇచ్చారు.

నాసా ఇప్పటి వరకు క్రూ-9 మిషన్ ద్వారా వారికి తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేయాలని భావించిందైనా, ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని ప్రకటించలేదు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిలియనీరైన వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన తాజా పోస్ట్‌లో ట్రంప్ నాసా, స్పేస్ ఎక్స్‌లను వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

“అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా భూమికి తీసుకురావాలని ట్రంప్ నన్ను కోరారు. మేము అలా చేస్తాము” అంటూ మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (క్రూ-10) ద్వారా సునీతా విలియమ్స్ సహా మరో వ్యోమగామిని భూమికి రప్పించే ప్రణాళిక వేగంగా అమలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ టెక్నీషియన్లు ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసి, చివరి దశ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఈ మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్ తన శరీరం భూమికి ఎలా అలవాటుపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీర్ఘకాలం శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో ఉన్న వ్యోమగాములు భూమిపై తిరిగి అడుగుపెట్టినప్పుడు, వాళ్ల శరీర వ్యవస్థ ఎలాంటి మార్పులు ఎదుర్కొంటుందో, స్పేస్ ఎక్స్ మిషన్ ఎంత త్వరగా వారిని భూమికి తీసుకురాబోతుందో గమనించాల్సిన అంశంగా మారింది.

This post was last modified on January 30, 2025 12:44 pm

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

14 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

58 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago