Trends

అంతరిక్షంలో 7 నెలలు.. నడవలేక, కూర్చోలేక, పడుకోలేక!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) చేరుకున్న ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా అనేక నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి, జూన్ 14నే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, సాంకేతిక లోపల కారణంగా నాసా మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ వచ్చింది.

ఇక ఇటీవల అప్‌డేట్‌లో సునీతా తన పరిస్థితిని వివరించారు, 7 నెలలుగా నడవలేదని, కూర్చోలేదని, పడుకోలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. శూన్య గురుత్వాకర్షణ ప్రభావం వల్ల తన శరీరం తేలియాడుతూనే ఉందని, భూమిపై నడిచిన అనుభూతిని కూడా గుర్తు చేసుకోలేకపోతున్నానని, నడవడం ఎలాగో గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఓ హైస్కూల్ విద్యార్థులతో వర్చువల్ సెషన్‌లో మాట్లాడిన ఆమె, అంతరిక్ష ప్రయాణం అనేది శారీరకంగా ఎంతటి సవాళ్లు విసురుతుందో వివరణ ఇచ్చారు.

నాసా ఇప్పటి వరకు క్రూ-9 మిషన్ ద్వారా వారికి తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేయాలని భావించిందైనా, ఇప్పటికీ ఖచ్చితమైన సమయాన్ని ప్రకటించలేదు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిలియనీరైన వ్యాపారవేత్త, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చేసిన తాజా పోస్ట్‌లో ట్రంప్ నాసా, స్పేస్ ఎక్స్‌లను వేగంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

“అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా భూమికి తీసుకురావాలని ట్రంప్ నన్ను కోరారు. మేము అలా చేస్తాము” అంటూ మస్క్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (క్రూ-10) ద్వారా సునీతా విలియమ్స్ సహా మరో వ్యోమగామిని భూమికి రప్పించే ప్రణాళిక వేగంగా అమలు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ టెక్నీషియన్లు ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసి, చివరి దశ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుత అంచనాల ప్రకారం, మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ తొలి వారంలో ఈ మిషన్ విజయవంతంగా పూర్తవుతుందని భావిస్తున్నారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత సునీతా విలియమ్స్ తన శరీరం భూమికి ఎలా అలవాటుపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీర్ఘకాలం శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో ఉన్న వ్యోమగాములు భూమిపై తిరిగి అడుగుపెట్టినప్పుడు, వాళ్ల శరీర వ్యవస్థ ఎలాంటి మార్పులు ఎదుర్కొంటుందో, స్పేస్ ఎక్స్ మిషన్ ఎంత త్వరగా వారిని భూమికి తీసుకురాబోతుందో గమనించాల్సిన అంశంగా మారింది.

This post was last modified on January 30, 2025 12:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

1 hour ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago