ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ రీతిలో బోనస్ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ యజమాని, సంవత్సరాంతపు బోనస్ను అందరికీ సర్ప్రైజ్గా ప్రకటించాడు. టేబుల్పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, 15 నిమిషాల టైం ఇచ్చాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా డబ్బు లెక్కించేందుకు పోటీ పడిపోయారు.
అందరికీ ఇది గేమ్లా మారగా, ప్రతి ఒక్కరూ తమకు చేతిలో పడినంత డబ్బును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది అచ్చంగా సినిమాలో చూసే సన్నివేశంలా కనిపించింది. ఈ వీడియోలో ఉద్యోగులు డబ్బు లెక్కిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఎంత త్వరగా లెక్కించగలరో, ఎంత తీసుకోవచ్చో చూసేందుకు వారు ఉత్సాహం చూపించారు. ఈ విధంగా బోనస్ ఇవ్వడం చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చాలామంది నెటిజన్లు ఇలాంటి బాస్ మాకు ఎప్పుడు దొరుకుతాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన విధానమా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగులను సంతోషపెట్టేందుకు బాస్ చేసిన మంచి ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి ఈ సంస్థ ఫాలో అయిన పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
This post was last modified on January 30, 2025 11:58 am
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…