Trends

15 నిమిషాల్లో ఎంత లెక్కించగలిగితే అంతా బోనస్‌!

ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్‌ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ రీతిలో బోనస్‌ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ యజమాని, సంవత్సరాంతపు బోనస్‌ను అందరికీ సర్‌ప్రైజ్‌గా ప్రకటించాడు. టేబుల్‌పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, 15 నిమిషాల టైం ఇచ్చాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా డబ్బు లెక్కించేందుకు పోటీ పడిపోయారు.

అందరికీ ఇది గేమ్‌లా మారగా, ప్రతి ఒక్కరూ తమకు చేతిలో పడినంత డబ్బును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది అచ్చంగా సినిమాలో చూసే సన్నివేశంలా కనిపించింది. ఈ వీడియోలో ఉద్యోగులు డబ్బు లెక్కిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఎంత త్వరగా లెక్కించగలరో, ఎంత తీసుకోవచ్చో చూసేందుకు వారు ఉత్సాహం చూపించారు. ఈ విధంగా బోనస్‌ ఇవ్వడం చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చాలామంది నెటిజన్లు ఇలాంటి బాస్‌ మాకు ఎప్పుడు దొరుకుతాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన విధానమా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగులను సంతోషపెట్టేందుకు బాస్‌ చేసిన మంచి ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడానికి ఈ సంస్థ ఫాలో అయిన పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది.

Kumar

Recent Posts

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

1 hour ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

5 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

5 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

7 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

8 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

8 hours ago