Trends

15 నిమిషాల్లో ఎంత లెక్కించగలిగితే అంతా బోనస్‌!

ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్‌ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ రీతిలో బోనస్‌ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ యజమాని, సంవత్సరాంతపు బోనస్‌ను అందరికీ సర్‌ప్రైజ్‌గా ప్రకటించాడు. టేబుల్‌పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, 15 నిమిషాల టైం ఇచ్చాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా డబ్బు లెక్కించేందుకు పోటీ పడిపోయారు.

అందరికీ ఇది గేమ్‌లా మారగా, ప్రతి ఒక్కరూ తమకు చేతిలో పడినంత డబ్బును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది అచ్చంగా సినిమాలో చూసే సన్నివేశంలా కనిపించింది. ఈ వీడియోలో ఉద్యోగులు డబ్బు లెక్కిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఎంత త్వరగా లెక్కించగలరో, ఎంత తీసుకోవచ్చో చూసేందుకు వారు ఉత్సాహం చూపించారు. ఈ విధంగా బోనస్‌ ఇవ్వడం చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చాలామంది నెటిజన్లు ఇలాంటి బాస్‌ మాకు ఎప్పుడు దొరుకుతాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన విధానమా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగులను సంతోషపెట్టేందుకు బాస్‌ చేసిన మంచి ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడానికి ఈ సంస్థ ఫాలో అయిన పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది.

This post was last modified on January 30, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

33 minutes ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

1 hour ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

3 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

4 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

6 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

7 hours ago