Trends

15 నిమిషాల్లో ఎంత లెక్కించగలిగితే అంతా బోనస్‌!

ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్‌ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఈ రీతిలో బోనస్‌ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ యజమాని, సంవత్సరాంతపు బోనస్‌ను అందరికీ సర్‌ప్రైజ్‌గా ప్రకటించాడు. టేబుల్‌పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, 15 నిమిషాల టైం ఇచ్చాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా డబ్బు లెక్కించేందుకు పోటీ పడిపోయారు.

అందరికీ ఇది గేమ్‌లా మారగా, ప్రతి ఒక్కరూ తమకు చేతిలో పడినంత డబ్బును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది అచ్చంగా సినిమాలో చూసే సన్నివేశంలా కనిపించింది. ఈ వీడియోలో ఉద్యోగులు డబ్బు లెక్కిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఎంత త్వరగా లెక్కించగలరో, ఎంత తీసుకోవచ్చో చూసేందుకు వారు ఉత్సాహం చూపించారు. ఈ విధంగా బోనస్‌ ఇవ్వడం చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చాలామంది నెటిజన్లు ఇలాంటి బాస్‌ మాకు ఎప్పుడు దొరుకుతాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన విధానమా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగులను సంతోషపెట్టేందుకు బాస్‌ చేసిన మంచి ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడానికి ఈ సంస్థ ఫాలో అయిన పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయింది.

This post was last modified on January 30, 2025 11:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

59 minutes ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

2 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

4 hours ago