ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ రీతిలో బోనస్ ఇచ్చిన తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ అనే సంస్థ యజమాని, సంవత్సరాంతపు బోనస్ను అందరికీ సర్ప్రైజ్గా ప్రకటించాడు. టేబుల్పై ఏకంగా రూ.70 కోట్ల విలువైన నోట్ల కట్టలు వేసి, 15 నిమిషాల టైం ఇచ్చాడు. ఉద్యోగులందరూ ఒక్కసారిగా డబ్బు లెక్కించేందుకు పోటీ పడిపోయారు.
అందరికీ ఇది గేమ్లా మారగా, ప్రతి ఒక్కరూ తమకు చేతిలో పడినంత డబ్బును గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది అచ్చంగా సినిమాలో చూసే సన్నివేశంలా కనిపించింది. ఈ వీడియోలో ఉద్యోగులు డబ్బు లెక్కిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఎంత త్వరగా లెక్కించగలరో, ఎంత తీసుకోవచ్చో చూసేందుకు వారు ఉత్సాహం చూపించారు. ఈ విధంగా బోనస్ ఇవ్వడం చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
చాలామంది నెటిజన్లు ఇలాంటి బాస్ మాకు ఎప్పుడు దొరుకుతాడా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది సరైన విధానమా? అని ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం ఉద్యోగులను సంతోషపెట్టేందుకు బాస్ చేసిన మంచి ప్రయత్నంగా ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి ఈ సంస్థ ఫాలో అయిన పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
This post was last modified on January 30, 2025 11:58 am
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…
రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…
కొన్ని సినిమాలు థియేటర్లలో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. కొన్ని పాటలు, సన్నివేశాలు కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. వర్షం…
స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణ…
స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…