నానమ్మ పెంచి పోషించిన పగ ఆధారంగా తమ చెల్లి భర్తను చంపేసిన ఇద్దరు మనవళ్లు…ఇప్పుడు నానమ్మతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గడచిన 3 రోజులుగా కలకలం రేపింది.
క్రైమ్ థ్రిల్లర్ మూనీని తలపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సూర్యపేటలోని పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ రాజకీయంగా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్డకొండ కృష్ణ పరిచయమయ్యాడు. బీ ఫార్మసీని మధ్యలోనే ఆపేసిన కృష్ణను నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో కృష్ణకు… నవీన్ సోదరి భార్గవితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా… నవీన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో విషయం తెలుసుకున్న నవీన్… కృష్ణను పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు.
కుర్ర వయసు కదా… నవీన్ మాటలు కృష్ణ లెక్క చేయలేదు. నవీన్ ఫ్యామిలీ అభిప్రాయాన్ని ధిక్కరించి భార్గవిని తీసుకెళ్లి గతేడాది ఆగస్టు 7న పెళ్లి చేసుకున్నాడు. ఆపై సూర్యాపేటలోనే ఈ కొత్త జంట కాపురం పెట్టారు. కులం తక్కువ యువకుడు తన మనవరాలిని పెళ్లి చేసుకున్నాడని నవీన్ నానమ్మ బుచ్చమ్మ కుతకుతలాడిపోయారట.
తమ కుటుంబ పరువు మంటగలిపిన కృష్ణను ఎలాగైనా మట్టుబెట్టాలని మనవళ్లు నవీన్, వంశీలకు నూరిపోసిందట. దీంతో నానమ్మ మాటను నెరవేర్చేందుకు మనవళ్లిద్దరూ తీర్మానించుకుని రంగంలోకి దిగిపోయారు.
కృష్ణ మర్డర్ కు పక్కా ప్లాన్ రచించిన నవీన్, వంశీలు… కృష్ణతో స్నేహం నెరపుతున్న మహేశ్ ను తమ బుట్టలో వేసుకున్నారు. మహేశ్ తోనే కృష్ణను నిర్జన ప్రదేశానికి రప్పించి ముగ్గురు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత నవీన్, వంశీలు కృష్ణ డెడ్ బాడీని తమ కారు డిక్కీలో వేసుకుని నేరుగా నానమ్మ వద్దకు వెళ్లారు.
కృష్ణ మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ తన పగ తీరినట్లుగా… మనవళ్ల భుజం తట్టారు. ఆ తర్వాత కృష్ణ బాడీని అక్కడికి సమీపంలోని మూసీ కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లి కృష్ణ తిరిగి రాకపోవడంతో భార్గవి పోలీసులను ఆశ్రయించింది.
కృష్ణ తండ్రి డేవిడ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు…కేవలం ఒకే రోజు వ్యవధిలో ఈ కేసును ఛేదించారు. కృష్ణ హత్యను పరువు హత్యగా పరిగణించి… ఈ హత్యలో మొత్తం ఆరుగురికి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు.
బుచ్చమ్మతో పాటు ఆమె కుమారుడు, భార్గవి తండ్రి సైదులు, నవీన్, వంశీ, మహేశ్, సాయిచరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కృష్ణ డెడ్ బాడీని చూసి కూడా సాయి పోలీసులకు సమాచారం ఇవ్వలేదట. ఇక హత్యకు ముందు కృష్ణ స్కూటీ మీదే అతడిని మహేశ్ తీసుకెళ్లడం గమనార్హం.
This post was last modified on January 30, 2025 6:04 am
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…