Trends

నానమ్మ కళ్లలో ఆనందం కోసం చంపేశారు!

నానమ్మ పెంచి పోషించిన పగ ఆధారంగా తమ చెల్లి భర్తను చంపేసిన ఇద్దరు మనవళ్లు…ఇప్పుడు నానమ్మతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గడచిన 3 రోజులుగా కలకలం రేపింది.

క్రైమ్ థ్రిల్లర్ మూనీని తలపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సూర్యపేటలోని పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ రాజకీయంగా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్డకొండ కృష్ణ పరిచయమయ్యాడు. బీ ఫార్మసీని మధ్యలోనే ఆపేసిన కృష్ణను నవీన్ తరచూ తన ఇంటికి తీసుకెళుతున్న క్రమంలో కృష్ణకు… నవీన్ సోదరి భార్గవితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కాగా… నవీన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీంతో విషయం తెలుసుకున్న నవీన్… కృష్ణను పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరించాడు.

కుర్ర వయసు కదా… నవీన్ మాటలు కృష్ణ లెక్క చేయలేదు. నవీన్ ఫ్యామిలీ అభిప్రాయాన్ని ధిక్కరించి భార్గవిని తీసుకెళ్లి గతేడాది ఆగస్టు 7న పెళ్లి చేసుకున్నాడు. ఆపై సూర్యాపేటలోనే ఈ కొత్త జంట కాపురం పెట్టారు. కులం తక్కువ యువకుడు తన మనవరాలిని పెళ్లి చేసుకున్నాడని నవీన్ నానమ్మ బుచ్చమ్మ కుతకుతలాడిపోయారట.

తమ కుటుంబ పరువు మంటగలిపిన కృష్ణను ఎలాగైనా మట్టుబెట్టాలని మనవళ్లు నవీన్, వంశీలకు నూరిపోసిందట. దీంతో నానమ్మ మాటను నెరవేర్చేందుకు మనవళ్లిద్దరూ తీర్మానించుకుని రంగంలోకి దిగిపోయారు.

కృష్ణ మర్డర్ కు పక్కా ప్లాన్ రచించిన నవీన్, వంశీలు… కృష్ణతో స్నేహం నెరపుతున్న మహేశ్ ను తమ బుట్టలో వేసుకున్నారు. మహేశ్ తోనే కృష్ణను నిర్జన ప్రదేశానికి రప్పించి ముగ్గురు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత నవీన్, వంశీలు కృష్ణ డెడ్ బాడీని తమ కారు డిక్కీలో వేసుకుని నేరుగా నానమ్మ వద్దకు వెళ్లారు.

కృష్ణ మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ తన పగ తీరినట్లుగా… మనవళ్ల భుజం తట్టారు. ఆ తర్వాత కృష్ణ బాడీని అక్కడికి సమీపంలోని మూసీ కాలువ పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లి కృష్ణ తిరిగి రాకపోవడంతో భార్గవి పోలీసులను ఆశ్రయించింది.

కృష్ణ తండ్రి డేవిడ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు…కేవలం ఒకే రోజు వ్యవధిలో ఈ కేసును ఛేదించారు. కృష్ణ హత్యను పరువు హత్యగా పరిగణించి… ఈ హత్యలో మొత్తం ఆరుగురికి పాత్ర ఉన్నట్లు నిర్ధారించారు.

బుచ్చమ్మతో పాటు ఆమె కుమారుడు, భార్గవి తండ్రి సైదులు, నవీన్, వంశీ, మహేశ్, సాయిచరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో కృష్ణ డెడ్ బాడీని చూసి కూడా సాయి పోలీసులకు సమాచారం ఇవ్వలేదట. ఇక హత్యకు ముందు కృష్ణ స్కూటీ మీదే అతడిని మహేశ్ తీసుకెళ్లడం గమనార్హం.

This post was last modified on January 30, 2025 6:04 am

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

5 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

7 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

8 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

8 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

8 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

9 hours ago