దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం గొప్ప విజయాన్ని అందుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించగా, ఏపీ శకటం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏటికొప్పాక బొమ్మల ప్రధాన అంశంగా రూపొందించిన ఈ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేంకటేశ్వర స్వామి, గణపతి ఆకారాలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ఇక పరేడ్ను వీక్షించిన ప్రముఖ అతిథులు, ప్రజలు ఈ శకటం వైభవాన్ని ఆస్వాదించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తయారైన శకటాలు ప్రదర్శనకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ శకటానికి మొదటి స్థానం దక్కగా, త్రిపుర శకటం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం మూడో స్థానాన్ని దక్కించుకుని ప్రదర్శనలో తన ప్రాముఖ్యతను చాటుకుంది. ఏటికొప్పాక కళాకారుల ప్రతిభను ప్రతిబింబించే ఈ శకటం అందరి మనసును దోచుకుంది.
కేవలం రాష్ట్రాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగంలో కూడా ఉత్తమ శకటాలను ఎంపిక చేశారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శకటం ఉత్తమంగా ఎంపికై మరింత ప్రత్యేకతను చాటుకుంది. ఇదే విధంగా త్రివిధ దళాల్లో జమ్మూ కశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం ఉత్తమ కవాతుగా నిలిచింది. ఈ క్రమంలో కేంద్ర బలగాల్లో ఢిల్లీ పోలీస్ కవాతు బృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్గా ఎంపికైంది.
రిపబ్లిక్ డే పరేడ్లో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేకంగా నిలిచిన కారణం, రాష్ట్రంలోని సంప్రదాయ కళలను, హస్తకళలను అందంగా చూపించడమే. ఏటికొప్పాకలో తయారయ్యే త్రవ్వకళ శిల్పాలను ప్రధానంగా ఉపయోగించి రూపొందించిన ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. శకటం రూపకల్పనలో పాల్గొన్న కళాకారులు, డిజైనర్లు ఈ ఘనతను సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఘనతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది. ఈ ప్రదర్శన రాష్ట్ర సంప్రదాయ కళా రూపాలను గుర్తించి, అభివృద్ధి చేసేందుకు మరింత సహాయపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో మరింత ప్రతిభను కనబరిచి, దేశవ్యాప్తంగా ఏపీ కీర్తిని పెంచాలని కళాకారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు.
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
రాష్ట్రంలో ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని భావిస్తున్న జనసేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుసరిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా…