Trends

మహా కుంభమేళాలో తొక్కిసలాట… 10 మందికి పైగా మృతి?

పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిత్యం కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తరహా రద్దీని ముందుగానే ఊహించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఫలితంగా 15 రోజులు దాటినా…ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే కుంభమేళా సాగుతోంది. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే పుణ్య స్నానాలు చేసి వెళుతున్నారు.

అయితే మౌని అమావాస్య నేపథ్యంలో బుధవారం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్ రాజ్ వచ్చారు. మంగళవారం రాత్రికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నట్లు సమాచారం. ఇలా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వారంతా బుధవారం తెల్లవారుజాముననే పుణ్య స్నానాల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా భక్తులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కొన్ని వర్గాలు అయితే 15 మంది చనిపోయారని చెబుతున్నాయి. అయితే మృతులు, గాయపడ్డ వారి సంఖ్యపై ఇప్పటిదాకా అదికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

ఇదిలా ఉంటే… తొక్కిసలాట గురించి తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందని, ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాని భరోసా ఇచ్చారు. మరోవైపు మౌని అమావాస్య నేపథ్యంలో తరలివచ్చిన వీఐపీల సేవలో అధికారులు తరించారని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు స్వాములు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంతాప సూచకంగా పుణ్య స్నానాలను నిలిపివేసుకుంటున్నట్లు అఖిల భారత అఖాడా పరిషత్ ప్రకటించింది.

This post was last modified on January 29, 2025 1:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

3 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

3 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

4 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

4 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

5 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

6 hours ago