పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిత్యం కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తరహా రద్దీని ముందుగానే ఊహించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఫలితంగా 15 రోజులు దాటినా…ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే కుంభమేళా సాగుతోంది. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే పుణ్య స్నానాలు చేసి వెళుతున్నారు.
అయితే మౌని అమావాస్య నేపథ్యంలో బుధవారం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్ రాజ్ వచ్చారు. మంగళవారం రాత్రికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నట్లు సమాచారం. ఇలా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వారంతా బుధవారం తెల్లవారుజాముననే పుణ్య స్నానాల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా భక్తులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కొన్ని వర్గాలు అయితే 15 మంది చనిపోయారని చెబుతున్నాయి. అయితే మృతులు, గాయపడ్డ వారి సంఖ్యపై ఇప్పటిదాకా అదికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
ఇదిలా ఉంటే… తొక్కిసలాట గురించి తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందని, ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాని భరోసా ఇచ్చారు. మరోవైపు మౌని అమావాస్య నేపథ్యంలో తరలివచ్చిన వీఐపీల సేవలో అధికారులు తరించారని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు స్వాములు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంతాప సూచకంగా పుణ్య స్నానాలను నిలిపివేసుకుంటున్నట్లు అఖిల భారత అఖాడా పరిషత్ ప్రకటించింది.
This post was last modified on January 29, 2025 1:41 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…