Trends

మహా కుంభమేళాలో తొక్కిసలాట… 10 మందికి పైగా మృతి?

పరమ పవిత్రంగా సాగుతున్న మహా కుంభమేళాలో బుధవారం ఉదయం అపశృతి చోటుచేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కావడంతో ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చారు. అదే సమయంలో వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ జన సందోహంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కేంద్రంగా జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిత్యం కోటి మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ తరహా రద్దీని ముందుగానే ఊహించిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. ఫలితంగా 15 రోజులు దాటినా…ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండానే కుంభమేళా సాగుతోంది. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే పుణ్య స్నానాలు చేసి వెళుతున్నారు.

అయితే మౌని అమావాస్య నేపథ్యంలో బుధవారం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా ప్రయాగ్ రాజ్ వచ్చారు. మంగళవారం రాత్రికే కోట్లాది మంది భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకున్నట్లు సమాచారం. ఇలా ప్రయాగ్ రాజ్ చేరుకున్న వారంతా బుధవారం తెల్లవారుజాముననే పుణ్య స్నానాల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా భక్తులు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. కొన్ని వర్గాలు అయితే 15 మంది చనిపోయారని చెబుతున్నాయి. అయితే మృతులు, గాయపడ్డ వారి సంఖ్యపై ఇప్పటిదాకా అదికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

ఇదిలా ఉంటే… తొక్కిసలాట గురించి తెలిసినంతనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేంద్రం అండగా ఉంటుందని, ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాని భరోసా ఇచ్చారు. మరోవైపు మౌని అమావాస్య నేపథ్యంలో తరలివచ్చిన వీఐపీల సేవలో అధికారులు తరించారని, ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు స్వాములు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంతాప సూచకంగా పుణ్య స్నానాలను నిలిపివేసుకుంటున్నట్లు అఖిల భారత అఖాడా పరిషత్ ప్రకటించింది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

4 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

7 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago