ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ.. అప్పటిదాకా అమల్లో ఉన్న పాత పద్దతులనే అమలు చేస్తూ వచ్చాయి. అయితే వారందరికీ భిన్నంగా సాగుతున్న మోదీ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి…వాటిలో అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా వన్ నేషన్… వన్ ఎలక్షన్ అన్న నూతన పద్ధతిపై ఇఫ్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెర లేసింది.
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పద్థతి అమలులోకి ఎప్పుడు వస్తుందో కానీ.. దాని కంటే ముందుగా దేశమంతా ఒకే సమయపాలనను అమలు చేసేందుకు మోదీ సర్కారు దాదాపుగా సయామత్తమైంది. ఇందుకోసం వన్ నేషన్… వన్ టైమ్ పేరిట ఓ నియమావళిని రూపొందించి… దాని పై అభిప్రాయాలు వెల్లడించాలంటూ దేశ ప్రజలను కోరింది. ఈ నూతన విధానంపై వచ్చే నెల 14 దాకా ప్రజల నుంచి కేంద్రం అభిప్రాయాలను స్వీకరించనుంది. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి… అంందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా?… లేదంటే యాజిటీజ్ గా అమల్లో పెట్టొచ్చా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.
ఇక వన్ నేషన్.. వన్ టైమ్ పేరిట కేంద్రం రూపొందించిన ముసాయిదా విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఒకే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలతో పాటుగా దేశాభివృద్ధిలో కీలకమైన వాణిజ్యం విషయంలోనే ఏకరీతి ప్రామాణిక సమయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వాణిజ్యం, సాధారణ పరిపాలనతో పాటుగా రవాణా, చట్టపరమై ఒప్పందాలు, ఆర్థిక కార్యకలాపాలతో సహా ప్రతి అంశంలోనూ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్ టీ)నే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఐఎస్ టీని వినియోగించి తీరాలి. దీనిని కాకుండా ఇతరత్రా సమయ పాలనను అమలు చేయడం కుదరదు. అంటే… ఓ అంశానికి సంబంధించి కశ్మీర్ లో ఏ ఐఎస్ టీని నమోదు చేస్తామో… కన్యాకుమారిలోనూ అదే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందన్న మాట.
This post was last modified on January 27, 2025 10:08 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…