Trends

ఇక వన్ నేషన్.. వన్ టైమ్!

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. అప్పటిదాకా వచ్చిన ప్రభుత్వాలన్నీ.. అప్పటిదాకా అమల్లో ఉన్న పాత పద్దతులనే అమలు చేస్తూ వచ్చాయి. అయితే వారందరికీ భిన్నంగా సాగుతున్న మోదీ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి…వాటిలో అవసరమైన మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా వన్ నేషన్… వన్ ఎలక్షన్ అన్న నూతన పద్ధతిపై ఇఫ్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెర లేసింది.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పద్థతి అమలులోకి ఎప్పుడు వస్తుందో కానీ.. దాని కంటే ముందుగా దేశమంతా ఒకే సమయపాలనను అమలు చేసేందుకు మోదీ సర్కారు దాదాపుగా సయామత్తమైంది. ఇందుకోసం వన్ నేషన్… వన్ టైమ్ పేరిట ఓ నియమావళిని రూపొందించి… దాని పై అభిప్రాయాలు వెల్లడించాలంటూ దేశ ప్రజలను కోరింది. ఈ నూతన విధానంపై వచ్చే నెల 14 దాకా ప్రజల నుంచి కేంద్రం అభిప్రాయాలను స్వీకరించనుంది. ఆ అభిప్రాయాలను క్రోడీకరించి… అంందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా?… లేదంటే యాజిటీజ్ గా అమల్లో పెట్టొచ్చా?అన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.

ఇక వన్ నేషన్.. వన్ టైమ్ పేరిట కేంద్రం రూపొందించిన ముసాయిదా విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఒకే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలతో పాటుగా దేశాభివృద్ధిలో కీలకమైన వాణిజ్యం విషయంలోనే ఏకరీతి ప్రామాణిక సమయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వాణిజ్యం, సాధారణ పరిపాలనతో పాటుగా రవాణా, చట్టపరమై ఒప్పందాలు, ఆర్థిక కార్యకలాపాలతో సహా ప్రతి అంశంలోనూ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్ టీ)నే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఐఎస్ టీని వినియోగించి తీరాలి. దీనిని కాకుండా ఇతరత్రా సమయ పాలనను అమలు చేయడం కుదరదు. అంటే… ఓ అంశానికి సంబంధించి కశ్మీర్ లో ఏ ఐఎస్ టీని నమోదు చేస్తామో… కన్యాకుమారిలోనూ అదే సమయాన్ని నమోదు చేయాల్సి ఉంటుందన్న మాట.

Satya

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

43 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

1 hour ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

3 hours ago