భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది.
అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి అందరూ అప్రమత్తతో వ్యవహరించారు. ఫలితంగా భారీ ప్రాణ నష్టం తప్పింది.
ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. హుస్సేన్ సాగర్ లో బోటు షికారు జోరుగానే సాగుతోంది. సెలవు కావడంతో రాత్రి అయినా కూడా పర్యాటకులు అధికంగా ఉండటంతో బోట్లు షికారుకు వెళ్లాయి. అదే సమయంలో హుస్సేన్ సాగర్ కు ఓ వైపున ఉన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరత మాతకు మహా హారతి పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణా సంచా నుంచి వెలువడిన నిప్పురవ్వలు నేరుగా వచ్చి షికారులోని బోట్లపై పడ్డాయి. ఆ వెంటనే బోట్లు రెండూ అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి.
బోట్లు అగ్ని కీలలకు చిక్కుకున్న సమయంలో రెండు బోట్లలో దాదాపుగా 15 మందికిపైగా జనం ఉన్నారు. బోట్లలో మంటలను చూసినంతనే వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోట్లలో నుంచి నీటిలోకి దూకేశారు. ఆ తర్వాత నిమిషాల్లోనే బోట్లు రెండూ అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులకు గాయాలైనట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… బోట్లలోనే టపాసులు పేల్చిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 26, 2025 10:31 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…