భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది.
అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి అందరూ అప్రమత్తతో వ్యవహరించారు. ఫలితంగా భారీ ప్రాణ నష్టం తప్పింది.
ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. హుస్సేన్ సాగర్ లో బోటు షికారు జోరుగానే సాగుతోంది. సెలవు కావడంతో రాత్రి అయినా కూడా పర్యాటకులు అధికంగా ఉండటంతో బోట్లు షికారుకు వెళ్లాయి. అదే సమయంలో హుస్సేన్ సాగర్ కు ఓ వైపున ఉన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరత మాతకు మహా హారతి పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణా సంచా నుంచి వెలువడిన నిప్పురవ్వలు నేరుగా వచ్చి షికారులోని బోట్లపై పడ్డాయి. ఆ వెంటనే బోట్లు రెండూ అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి.
బోట్లు అగ్ని కీలలకు చిక్కుకున్న సమయంలో రెండు బోట్లలో దాదాపుగా 15 మందికిపైగా జనం ఉన్నారు. బోట్లలో మంటలను చూసినంతనే వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోట్లలో నుంచి నీటిలోకి దూకేశారు. ఆ తర్వాత నిమిషాల్లోనే బోట్లు రెండూ అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులకు గాయాలైనట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… బోట్లలోనే టపాసులు పేల్చిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 26, 2025 10:31 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…