Trends

హుస్సేన్ సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం… తప్పిన ప్రాణ నష్టం

భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉండి ఉన్నా… భారీ ప్రాణ నష్టమే సంభవించేది.

అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో అప్పటికీ ఇంకా జన సందోహం భారీగా ఉన్న నేపథ్యంలో… ప్రమాదం జరిగిన విషయాన్ని క్షణాల్లో గమనించి అందరూ అప్రమత్తతో వ్యవహరించారు. ఫలితంగా భారీ ప్రాణ నష్టం తప్పింది.

ఈ ప్రమాదం జరిగిన తీరు కూడా అందరినీ షాక్ కు గురి చేసింది. హుస్సేన్ సాగర్ లో బోటు షికారు జోరుగానే సాగుతోంది. సెలవు కావడంతో రాత్రి అయినా కూడా పర్యాటకులు అధికంగా ఉండటంతో బోట్లు షికారుకు వెళ్లాయి. అదే సమయంలో హుస్సేన్ సాగర్ కు ఓ వైపున ఉన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరత మాతకు మహా హారతి పేరిట ప్రత్యేక కార్యక్రమం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భారీ ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణా సంచా నుంచి వెలువడిన నిప్పురవ్వలు నేరుగా వచ్చి షికారులోని బోట్లపై పడ్డాయి. ఆ వెంటనే బోట్లు రెండూ అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి.

బోట్లు అగ్ని కీలలకు చిక్కుకున్న సమయంలో రెండు బోట్లలో దాదాపుగా 15 మందికిపైగా జనం ఉన్నారు. బోట్లలో మంటలను చూసినంతనే వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోట్లలో నుంచి నీటిలోకి దూకేశారు. ఆ తర్వాత నిమిషాల్లోనే బోట్లు రెండూ అగ్నికి ఆహుతి అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు పర్యాటకులకు గాయాలైనట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే… బోట్లలోనే టపాసులు పేల్చిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on January 26, 2025 10:31 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

5 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

25 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago