Trends

సింగర్ తో సిరాజ్.. గాసిప్స్ లో నిజమెంత?

బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనై భోస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలలో సిరాజ్‌ను హైలెట్ చేయడమే. ఇటీవల జనై భోస్లే తన పుట్టిన రోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో సిరాజ్‌తో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫొటో హైలెట్ అయ్యింది. ఆమె ఫొటోలు పోస్ట్ చేసి మూడు రోజులైనా ఇంకా ఈ గాసిప్స్ డోస్ తగ్గడం లేదు.

ఫోటోల్లో ఇతర సెలబ్రెటీల ఫొటోలు కూడా ఉన్నాయి. కానీ సిరాజ్, జనై సరదాగా నవ్వుతూ క్లోజప్ లో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా, జనై తన ఇన్‌స్టాగ్రామ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో అవడం, మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. గతంలో ఆమె సిరాజ్ కోసమే పలు మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐపీఎల్ మెగా వేలంలో మహ్మద్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జనై భోస్లే గుజరాత్ జట్టును ఫాలో కావడం, ఆమెతో సిరాజ్ మధ్య ఉన్న సంబంధం గురించి రూమర్లు మరింతగా ఊపందుకున్నాయి.

వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని గమనించిన నెటిజన్లు, ఇది వారి ప్రేమకథను ధృవీకరిస్తుందేమో అని అనుమానిస్తున్నారు. అయితే, సిరాజ్ – జనై భోస్లే ప్రేమలో ఉన్నారా అనే అంశంపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు.

ఎటువంటి సమాచారం లేకుండా ఇటువంటి గాసిప్స్ షేర్ చెయ్యడం సబబు కాదు. ఈ రూమర్లు నిజమో కాదో స్పష్టత రావాలంటే, వారు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.

This post was last modified on January 26, 2025 10:51 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

3 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago