బాలీవుడ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో సిరాజ్ తో క్లోజ్ గా ఉన్నారన్న వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం జనై భోస్లే ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలలో సిరాజ్ను హైలెట్ చేయడమే. ఇటీవల జనై భోస్లే తన పుట్టిన రోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో సిరాజ్తో ఆమె క్లోజ్గా ఉన్న ఫొటో హైలెట్ అయ్యింది. ఆమె ఫొటోలు పోస్ట్ చేసి మూడు రోజులైనా ఇంకా ఈ గాసిప్స్ డోస్ తగ్గడం లేదు.
ఫోటోల్లో ఇతర సెలబ్రెటీల ఫొటోలు కూడా ఉన్నాయి. కానీ సిరాజ్, జనై సరదాగా నవ్వుతూ క్లోజప్ లో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. పైగా, జనై తన ఇన్స్టాగ్రామ్లో గుజరాత్ టైటాన్స్ జట్టును మాత్రమే ఫాలో అవడం, మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. గతంలో ఆమె సిరాజ్ కోసమే పలు మ్యాచ్ లను వీక్షించేందుకు వచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐపీఎల్ మెగా వేలంలో మహ్మద్ సిరాజ్ను రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జనై భోస్లే గుజరాత్ జట్టును ఫాలో కావడం, ఆమెతో సిరాజ్ మధ్య ఉన్న సంబంధం గురించి రూమర్లు మరింతగా ఊపందుకున్నాయి.
వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని గమనించిన నెటిజన్లు, ఇది వారి ప్రేమకథను ధృవీకరిస్తుందేమో అని అనుమానిస్తున్నారు. అయితే, సిరాజ్ – జనై భోస్లే ప్రేమలో ఉన్నారా అనే అంశంపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు.
ఎటువంటి సమాచారం లేకుండా ఇటువంటి గాసిప్స్ షేర్ చెయ్యడం సబబు కాదు. ఈ రూమర్లు నిజమో కాదో స్పష్టత రావాలంటే, వారు అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.
This post was last modified on January 26, 2025 10:51 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…