భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. అతడి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది.
ఈ ప్రదర్శనతో తిలక్ అరుదైన రికార్డును సొంతం చేసుకొని, టీమిండియాలో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా తిలక్ నిలిచాడు.
తాజాగా తిలక్ వర్మ వరుసగా నాలుగు ఇన్నింగ్స్లలో (19*, 120*, 107*, 72*) ఔట్ కాకుండా 318 పరుగులు సాధించాడు. ఈ ఫీట్తో అతడు న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్మన్ యొక్క 271 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
అంతేకాక, విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టి, ఈ ఘనతను సాధించాడు. టీమిండియాలో కోహ్లీ గతంలో 258 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు తిలక్ తన అద్భుత ప్రదర్శనతో ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ 318* పరుగులతో ముందంజలో ఉండగా, అతని వెంట విరాట్ కోహ్లీ (258), సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252) వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ రికార్డుతో తిలక్ భారత క్రికెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభించాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, భారత బ్యాటింగ్ తొలుత తడబడింది. అయితే తిలక్ తన ఒంటరి పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో తన 72 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయం భారత జట్టును ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది.
This post was last modified on January 26, 2025 12:23 pm
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…