భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించడంలో తిలక్ కీలక పాత్ర పోషించాడు. అతడి 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత విజయానికి బలమైన ఆధారంగా నిలిచింది.
ఈ ప్రదర్శనతో తిలక్ అరుదైన రికార్డును సొంతం చేసుకొని, టీమిండియాలో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా తిలక్ నిలిచాడు.
తాజాగా తిలక్ వర్మ వరుసగా నాలుగు ఇన్నింగ్స్లలో (19*, 120*, 107*, 72*) ఔట్ కాకుండా 318 పరుగులు సాధించాడు. ఈ ఫీట్తో అతడు న్యూజిలాండ్ క్రికెటర్ మార్క్ చాప్మన్ యొక్క 271 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.
అంతేకాక, విరాట్ కోహ్లీని కూడా వెనక్కి నెట్టి, ఈ ఘనతను సాధించాడు. టీమిండియాలో కోహ్లీ గతంలో 258 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు తిలక్ తన అద్భుత ప్రదర్శనతో ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ 318* పరుగులతో ముందంజలో ఉండగా, అతని వెంట విరాట్ కోహ్లీ (258), సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252) వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ రికార్డుతో తిలక్ భారత క్రికెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభించాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 165 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, భారత బ్యాటింగ్ తొలుత తడబడింది. అయితే తిలక్ తన ఒంటరి పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో తన 72 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయం భారత జట్టును ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది.
This post was last modified on January 26, 2025 12:23 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…