యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్ గా మారింది. అడవి మల్లెలాంటి అందంతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ పాపులర్ అయ్యింది.
ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ.. అంతర్జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాయి. ఆమె ఫోటోల్ని పోస్టు చేస్తే చాలు.. సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇంత చేసిన ఆమెకు సొంత సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ.. ఆమె పేరుతో ఖాతాలు తెరుస్తున్న వారు మాత్రం విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంటున్నారు.
రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానని చెప్పటం తెలిసిందే. ఆమెను చూసేందుకు.. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారిని గండి కొడుతోంది. ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కానీ.. ఎలాంటి వ్యాపారం జరగట్లేదు. దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది. ఇది వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
దీంతో.. మోనాలిసా తండ్రి.. ఆమెను సొంతూరుకు (ఇండోర్) పంపేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఓకే.. ఇంతకూ ఈ మట్టిలోని వజ్రాన్ని గుర్తించింది ఎవరు? ఆమెకు ఇంతటి పాపులార్టీకి కారణం ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగ్ రాజ్ చేరుకొని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మోనాలిసాను.. మహా కుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రతినిధి ఆమెను చూశారు.
ఆమెను ఇంటర్వ్యూ చేసి.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియోకు క్రేజ్ రావటం.. ఆమె అందం అందరిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన పరిస్థితి. దీంతో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. ఆ మాటకు వస్తే మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మోనాలిసా. చివరగా.. ఈ అడవి మల్లెకు ఇప్పుడో కొత్త పేరు పెట్టేశారు. లియనార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు. ఆమె అందం బాలీవుడ్ తారల కంటే పదుల రెట్లు అందంగా ఉంటుందని పొగిడేస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:24 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…