యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి హాట్ టాపిక్ గా మారింది. అడవి మల్లెలాంటి అందంతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ పాపులర్ అయ్యింది.
ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ.. అంతర్జాతీయ మీడియా మొదలు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్నాయి. ఆమె ఫోటోల్ని పోస్టు చేస్తే చాలు.. సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది. ఇంత చేసిన ఆమెకు సొంత సోషల్ మీడియా ఖాతా లేదు. కానీ.. ఆమె పేరుతో ఖాతాలు తెరుస్తున్న వారు మాత్రం విపరీతంగా ఫాలోవర్లను పెంచేసుకుంటున్నారు.
రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానని చెప్పటం తెలిసిందే. ఆమెను చూసేందుకు.. ఆమెతో సెల్పీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారిని గండి కొడుతోంది. ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కానీ.. ఎలాంటి వ్యాపారం జరగట్లేదు. దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది. ఇది వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
దీంతో.. మోనాలిసా తండ్రి.. ఆమెను సొంతూరుకు (ఇండోర్) పంపేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఓకే.. ఇంతకూ ఈ మట్టిలోని వజ్రాన్ని గుర్తించింది ఎవరు? ఆమెకు ఇంతటి పాపులార్టీకి కారణం ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ నెల 13న మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగ్ రాజ్ చేరుకొని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మోనాలిసాను.. మహా కుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ చానల్ ప్రతినిధి ఆమెను చూశారు.
ఆమెను ఇంటర్వ్యూ చేసి.. వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియోకు క్రేజ్ రావటం.. ఆమె అందం అందరిని విపరీతంగా ఆకర్షించింది. దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన పరిస్థితి. దీంతో మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. ఆ మాటకు వస్తే మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మోనాలిసా. చివరగా.. ఈ అడవి మల్లెకు ఇప్పుడో కొత్త పేరు పెట్టేశారు. లియనార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు. ఆమె అందం బాలీవుడ్ తారల కంటే పదుల రెట్లు అందంగా ఉంటుందని పొగిడేస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:24 am
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…