Trends

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా జరగనున్న ఈ ట్రోఫీపై ఇప్పటికే పలు రకాల వివాదాలు హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో కొత్త వివాదం చెలరేగింది. భారత జట్టు జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు ఉండాలన్న ఐసీసీ నిబంధనకు బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జెర్సీలపై పాకిస్థాన్ పేరు ముద్రించడం తగదని భారత్ తేల్చిచెప్పినట్లు సమాచారం. సాధారణంగా ఐసీసీ టోర్నీలలో ఆతిథ్య దేశం పేరు జెర్సీలపై ఉండటం ఆనవాయితీ. అయితే భారత్ తమ మ్యాచ్‌లు ప్రధానంగా దుబాయ్ వేదికగా ఆడతామని, కాబట్టి పాకిస్థాన్ పేరు జెర్సీలపై ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనిపై ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి జట్టూ టోర్నీ లోగో, ఆతిథ్య దేశం పేరును తమ జెర్సీలపై ముద్రించాల్సిందేనని స్పష్టం చేసింది.

ఐసీసీ ప్రతినిధి ఒకరు, “టోర్నమెంట్ నియమాలను ప్రతి దేశం పాటించాల్సిందే. జెర్సీలపై టోర్నీ లోగో, ఆతిథ్య దేశం పేరు లేకపోతే భారత జట్టుపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది,” అని పేర్కొన్నారు. బీసీసీఐ దీనిపై తమ నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకోనుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బీసీసీఐ, పీసీబీ మధ్య ఉన్న ఉద్రిక్తతలు ఈ వివాదానికి దారి తీసినట్లు అనిపిస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్ పంపే విషయంపై భారత్ అసహనం వ్యక్తం చేయగా, చివరికి టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ ఒప్పుకుంది. ఇది భారత్-పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ టోర్నీలకు సంబంధించి భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు అమలు అయ్యే అవకాశముంది.

This post was last modified on January 22, 2025 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago