మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు కిలోమీటర్లు లేదంటే పది కిలోమీటర్లు ఇలా.. మారథాన్ పేరుతో మనుషులు పరుగులు తీయటం తెలిసిందే. కానీ.. మనుషులు.. ఆ మనిషి క్రియేట్ చేసిన రోబోలు పాల్గొనే సిత్రమైన పోటీకి చైనా వేదిక కానుంది.
ఏప్రిల్ లో చైనా రాజధాని బీజింగ్ పరిధిలోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించే 21 కి.మీ. మారథాన్ లో డజన్లు కొద్దీ హ్యుమనాయిడ్ రోబోలు 12వేల మంది మానవ అథ్లెట్లతో పోటీ పడనున్నాయి.
అయితే.. ఈ పోటీల్లో మనిషి.. రోబో అన్న తేడా లేకుండా ఎవరైతే అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శిస్తారో వారు విజేతలుగా నిలవనున్నారు. మనుషులు కావొచ్చు.. రోబోలు కావొచ్చు.. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేయాలని నిర్ణయించారు. ఈ మారథాన్ లో పాల్గొనే రోబోలను 20 కంటే ఎక్కువ కంపెనీలు డెవలప్ చేశాయి. మనుషుల మాదిరి కనిపించటానికి ఈ రోబోట్ లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ రోబోట్ లు తప్పనిసరిగా 0.5 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉండాలి. కనీస హిప్ టు ఫుట్ ఎక్స్ టెన్షన్ 0.45 మీటర్లుగా ఉండాలి. రిమోట్ కంట్రోల్.. ఆటోమాటిక్ రోబోట్ లు సైతం ఈ పోటీలో పాల్గొనే వీలుంది. రోబోల పని తీరు సరిగా ఉండేందుకు వీలుగా.. వాటికి అవసరమైన బ్యాటరీలను ఆపరేటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. చైనా సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్ రోబోట్ గంటకు పది కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని చెబుతున్నారు. గతంలోనూ ఇవి మారథాన్లలో పాల్గొన్నప్పటికి.. రియల్ రేసులో పాల్గొనటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మరీ.. పోటీ ఎలా ఉంటుందో చూడాలి.
ఇంతకూ ఇదంతా ఎందుకు? చైనా ఇలాంటి పనుల్ని ఎందుకు చేస్తుందంటే దానికో కారణం లేకపోలేదు. చైనాలో పెద్ద వయస్కుల వారు పెరిగిపోయారు. దీంతో శ్రామికశక్తి తగ్గింది. దీంతో.. దేశం జనాభాపరమైన సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి వేళ.. ఇతర దేశాలతో పోటీ పడేందుకు అవసరమైన శ్రామిక శక్తిని రోబోట్ ల ద్వారా సిద్ధం చేసుకోవాలన్న ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున రోబోట్ లను సిద్ధం చేస్తున్నట్లుగా చెప్పాలి.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…