అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో దేశ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును మొదలుపెట్టిన ట్రంప్…ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి ఎలాంటి ఆర్థికపరమైన సహకారం లభించదు. అంతేకాకుండా ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించే ఈ సంస్థ ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమెరికా విమర్శించే ప్రమాదం లేకపోలేదు. అంటే.. డబ్ల్యూహెచ్ఓ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా ఇకపై వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న మాట. అంటే… అటు ఆర్థికంగానే కాకుండా ఇటు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసే విషయంలోనూ డబ్ల్యూహెచ్ఓ ప్రతిబంధకాలను ఎదుర్కోనుందన్న మాట.
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరిగ్గా వ్యవహరించలేదంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు అమెరికా అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోయిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగే విషయంపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో డబ్ల్యూహెచ్ఓ వ్యవహారంపై ఆయన వేగంగా నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా చాలా వేగంగా స్పందించింది. ఇదెక్కడి పద్ధతి అంటూ ట్రంప్ నిర్ణయాన్ని చైనా ఎండగట్టింది. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టే డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల విషయంలో ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కూడా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైైదొలగినా…తాము మాత్రం ఆ సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు ఆర్థికంగా అండగా నిలుస్తామని, గతంలో కంటే కూడా అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తామని ఆయన తెలిపారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…