అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో దేశ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును మొదలుపెట్టిన ట్రంప్…ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి ఎలాంటి ఆర్థికపరమైన సహకారం లభించదు. అంతేకాకుండా ప్రపంచ దేశాల ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించే ఈ సంస్థ ఇకపై తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమెరికా విమర్శించే ప్రమాదం లేకపోలేదు. అంటే.. డబ్ల్యూహెచ్ఓ తీసుకునే ప్రతి నిర్ణయంపైనా ఇకపై వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న మాట. అంటే… అటు ఆర్థికంగానే కాకుండా ఇటు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేసే విషయంలోనూ డబ్ల్యూహెచ్ఓ ప్రతిబంధకాలను ఎదుర్కోనుందన్న మాట.
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరిగ్గా వ్యవహరించలేదంటూ ట్రంప్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నాడు అమెరికా అధ్యక్షుడిగా పదవి నుంచి దిగిపోయిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగే విషయంపై అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో డబ్ల్యూహెచ్ఓ వ్యవహారంపై ఆయన వేగంగా నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా చాలా వేగంగా స్పందించింది. ఇదెక్కడి పద్ధతి అంటూ ట్రంప్ నిర్ణయాన్ని చైనా ఎండగట్టింది. ప్రపంచ ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టే డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థల విషయంలో ఇలాంటి విపరీత నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కూడా తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైైదొలగినా…తాము మాత్రం ఆ సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తామని ప్రకటించారు. డబ్ల్యూహెచ్ఓకు ఆర్థికంగా అండగా నిలుస్తామని, గతంలో కంటే కూడా అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తామని ఆయన తెలిపారు.
This post was last modified on January 21, 2025 5:21 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…